అండమాన్ నికోబార్ దీవులు
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు 572 ద్వీపాల సమూహం. వీటిలో 37 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం కలిసే వద్ద ఈ ద్వీపాల సమూహం ఉంది.[5] భూభాగం విస్తీర్ణం సుమారు 150 చ.కి.మీ.ఇండోనేషియాలోని ఆషేకు ఉత్తరంగా ఉంది. ఈ దీవులను థాయిలాండ్, మయన్మార్ నుండి అండమాన్ సముద్రం వేరు చేస్తోంది. ఇందులో రెండు ద్వీప సమూహాలున్నాయి - అండమాన్ దీవులు (పాక్షికంగా), నికోబార్ దీవులు, వీటిని 150 కిలోమీటర్ల వెడల్పు గల టెన్ డిగ్రీ ఛానల్ (10 ° N సమాంతరం ) వేరుచేస్తోంది. ఈ అక్షాంశానికి ఉత్తరాన అండమాన్లు, దక్షిణాన నికోబార్లు (వీటి మధ్య దూరం 179 కిమీ) ఉన్నాయి. ఈ దీవులకు తూర్పున అండమాన్ సముద్రం, పశ్చిమాన బంగాళాఖాతం ఉంది.
అండమాన్ నికోబార్ దీవులు | |||||||
---|---|---|---|---|---|---|---|
Coordinates (పోర్ట్ బ్లెయిర్): 11.68°N 92.77°E / 11.68; 92.77 | |||||||
దేశం | India | ||||||
స్థాపన | 1956 నవంబరు 1 | ||||||
రాజధాని, అతిపెద్ద నగరం | పోర్ట్ బ్లెయిర్ | ||||||
జిల్లాలు | 3 | ||||||
Government | |||||||
• లెఫ్టినెంట్ గవర్నర్ | దేవేంద్ర కుమార్ జోషి, అడ్మిరల్ (రిటైర్డు) | ||||||
• ప్రధాన కార్యదర్శి, (భారతదేశం) | చేతన్ భూషణ్ సంఘి, ఐ.ఎ.ఎస్ | ||||||
Area | |||||||
• Total | 8,250 km2 (3,190 sq mi) | ||||||
• Rank | 28 | ||||||
Population (2012)[2] | |||||||
• Total | 3,80,520 | ||||||
• Density | 46/km2 (120/sq mi) | ||||||
భాషలు[3] | |||||||
• అధికార | హిందీ, ఆంగ్లం[3] | ||||||
• మాట్లాడేవి | బెంగాలీ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, నికోబారీస్, కురుఖ్, ముండా, ఖరియా[4] | ||||||
Time zone | UTC+05:30 | ||||||
ISO 3166 code | IN-AN | ||||||
HDI (2018) | 0.739 (High) •6th | ||||||
Website | |||||||
Symbols of అండమాన్ నికోబార్ దీవులు | |||||||
Bird | అండమాన్ వుడ్ పావురం – 2004 | ||||||
Flower | పిన్మా– 2014 | ||||||
Mammal | దుగోంగ్ – 2004 | ||||||
Tree | అండమాన్ పడౌక్ – 2004 | ||||||
ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని పోర్ట్ బ్లెయిర్ నగరం. ద్వీపాల మొత్తం భూభాగం సుమారు 8,249 చ.కి.మీ ఉంటుంది. ఈ భూభాగాన్ని మూడు జిల్లాలుగా విభజించారు: కార్ నికోబార్ రాజధానిగా నికోబార్ జిల్లా, పోర్ట్ బ్లెయిర్తో రాజధానిగా దక్షిణ అండమాన్ జిల్లా, మాయాబందర్ రాజధానిగా ఉత్తర మధ్య అండమాన్ జిల్లా.ఈ ద్వీపాల్లో భారత సాయుధ దళాలకు చెందిన అండమాన్ నికోబార్ కమాండ్ ఉంది. త్రివిధ దళాలకు చెందిన భౌగోళిక కమాండు ఇదొక్కటే.అండమాన్ ద్వీపాల్లో సెంటినెలీస్ ప్రజలు నివాసముంటారు. నాగరికత స్పృశించని మానవులు వీరు ఇప్పటకీ పాతరాతియుగపు స్థాయి లోనే ఇంకా జీవిస్తున్న మానవులు వీరొక్కరే. [6]