అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం
From Wikipedia, the free encyclopedia
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) యాజమాన్యంలో, వారి నిర్వహణలోనే ఉన్న క్రికెట్ స్టేడియం. ఇది ఢిల్లీ లోని బహదూర్ షా జఫర్ మార్గ్లో ఉంది.[2][3] దీన్ని 1883 లో ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరుతో నిర్మించారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ తర్వాత ఇది భారతదేశంలోని రెండవ అత్యంత పురాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. 2019 అక్టోబరు 25 నాటికి ఇక్కడ 34 టెస్టులు, 25 ODIలు, 6 T20Iలు ఆడారు.
Former names | ఫిరోజ్ షా కోట్లా స్టేడియం |
---|---|
Location | బహదూర్ షా జఫర్ మార్గ్, ఢిల్లీ గేట్ వద్ద, ఢిల్లీ |
Owner | ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ |
Operator | ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ |
Capacity | 41,842[1] |
Surface | పచ్చిక (ఓవల్) |
Construction | |
Opened | 1883 |
Construction cost | ₹114.5 కోట్లు |
మైదాన సమాచారం | |
ప్రదేశం | Bahadur Shah Zafar Marg, Delhi |
భౌగోళికాంశాలు | 28°38′16″N 77°14′35″E |
స్థాపితం | 1882 |
యజమాని | Utpal Kant |
వాడుతున్నవారు | భారత క్రికెట్ జట్టు ఢిల్లీ క్రికెట్ జట్టు ఢ్జిల్లీ కాపిటల్స్ |
ఎండ్ల పేర్లు | |
స్టేడియం ఎండ్ పెవిలియన్ ఎండ్ | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి టెస్టు | 1948 10–14 November: India v వెస్ట్ ఇండీస్ |
చివరి టెస్టు | 2023 17–19 February: India v ఆస్ట్రేలియా |
మొదటి ODI | 1982 15 September: India v శ్రీలంక |
చివరి ODI | 202211 October: India v దక్షిణాఫ్రికా |
మొదటి T20I | 2016 23 March: ఆఫ్ఘనిస్తాన్ v ఇంగ్లాండు |
చివరి T20I | 2022 9 June: India v దక్షిణాఫ్రికా |
మొదటి మహిళా టెస్టు | 1976 12–14 November: India v వెస్ట్ ఇండీస్ |
చివరి మహిళా టెస్టు | 1984 21–24 January: India v ఆస్ట్రేలియా |
మొదటి WODI | 1985 19 February: India v న్యూజీలాండ్ |
చివరి WODI | 1997 9 December: India v శ్రీలంక |
మొదటి WT20I | 2016 15 March: న్యూజీలాండ్ v శ్రీలంక |
చివరి WT20I | 2016 30 March: న్యూజీలాండ్ v ఇంగ్లాండు |
2023 19 February నాటికి Source: CricInfo | |
2017 సన్మాన కార్యక్రమంలో, డిడిసిఎ స్టేడియంలోని నాలుగు స్టాండ్లకు భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ, భారత మాజీ ఆల్ రౌండర్ మొహిందర్ అమర్నాథ్, మాజీ భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ ల పేర్లు పెట్టారు. హోమ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్కి రమణ్ లాంబా పేరు, బయట డ్రెస్సింగ్ రూమ్కి ప్రకాష్ భండారి పేరు పెట్టారు.[4]
2019 సెప్టెంబరు 12 న, డిడిసిఎ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జ్ఞాపకార్థం స్టేడియం పేరును మార్చారు.[5] అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్టేడియంలో ఆధునిక సౌకర్యాలుగా మార్చడం, దాని సీటింగ్ సామర్థ్యాన్ని పెంచడం, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలను నిర్మించడం వంటి పనులు చేసారు. స్టేడియంలోని ఒక స్టాండ్కు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు పెట్టారు. ఈ పేరు మార్పును భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ విమర్శించాడు.[6] పేరు మార్పును ప్రకటించిన తర్వాత, తాము స్టేడియం పేరును మాత్రమే మార్చామనీ, ఇక్కడి మైదానం పేరు ఫిరోజ్ షా కోట్లా మైదానం అనే ఉంటుందనీ స్పష్టం చేసింది.
2017 నాటికి, భారత జాతీయ క్రికెట్ జట్టు ఈ మైదానంలో 28 సంవత్సరాలుగా టెస్ట్ మ్యాచ్లలోను, 10 సంవత్సరాలకు పైగా ODI మ్యాచ్లలోనూ అజేయంగా ఉంది.[7]