![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d2/Delhi_Darwaja_1.jpg/640px-Delhi_Darwaja_1.jpg&w=640&q=50)
అహ్మదాబాద్ జిల్లా
గుజరాత్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం అయిన అహ్మదాబాద్ నగరాన్ని సుల్తాన్ అహ్మద్ షా, సబర్మతి నది ఒడ్డున నిర్మించారు. 1411 ఫిబ్రవరి 26 తేదీన సూఫీ సన్యాసుల సమక్షంలో ఈ నాడు ఎలిస్ బ్రిడ్జ్ అని పిలవబడే ప్రదేశంలో సబర్మతి నది ఒడ్డున శంకుస్థాపన చేశాడు. ఈ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ చూడచ్చు ఈ ప్రదేశాన్ని మానెక్ బుర్జ్ అంటారు. అయితే ఈ శంకుస్థాపన తేది గురించి అనేక వివాదాలున్నాయి. చరిత్రకారులు ఎక్కువగా విశ్వసించే తేది మాత్రం ఇదే. దీనికి ఆధారం రత్నమణి భీమ్రావ్ జోట్ 1928లో వ్రాసిన "గుజరాత్ను పట్నాగర్ అమ్దావాద్", అనేక ఇతర చారిత్రాత్మక పుస్తకాలు. అహ్మదాబాద్ గెజిటీర్ ప్రకారం ఈ పట్టణానికి పునాది రాళ్ళు 1411 మార్చి 4న పడ్డాయి "మాంచెస్టర్ ఆప్ ఇండియా" అని యూరోపియన్లతో శతాబ్దాల క్రితం కొనియాడిన, ఈ నగరంలో ఎన్నో సుందరమైన పురాతన కట్టడాలను ఈ నాటికీ పాత పట్టణం (ఓల్డ్ సిటీ) లో చూడొచ్చు. ప్రహరీ కలిగిన ఈ పాత పట్టణంలో అనేక సుందరమైన రాతి తలుపులు (దర్వాజాలు) మనసుని మైమరిపిస్తాయి. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/9/91/Sayyadsiddiki.jpg/640px-Sayyadsiddiki.jpg)