ఎం. చిన్నస్వామి స్టేడియం
From Wikipedia, the free encyclopedia
మంగళం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులోని క్రికెట్ స్టేడియం. దీనిని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అని కూడా పిలుస్తారు.
కెఎస్సిఏ స్టేడియం | |
మైదాన సమాచారం | |
---|---|
ప్రదేశం | బెంగళూరు |
స్థాపితం | మే 1969; 55 సంవత్సరాల క్రితం (1969-05) |
సామర్థ్యం (కెపాసిటీ) | 40,000 |
యజమాని | కర్ణాటక ప్రభుత్వం |
ఆపరేటర్ | కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్సిఎ) |
వాడుతున్నవారు |
|
ఎండ్ల పేర్లు | |
పెవిలియన్ ఎండ్ బిఇఎమ్ఎల్ ఎండ్ | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి టెస్టు | 1974 నవంబరు 22–27: India v వెస్ట్ ఇండీస్ |
చివరి టెస్టు | 2022 మార్చి 12–16: India v శ్రీలంక |
మొదటి ODI | 1982 26 సెప్టెంబరు: India v శ్రీలంక |
చివరి ODI | 202019 జనవరి: India v ఆస్ట్రేలియా |
మొదటి T20I | 2012 25 డిసెంబరు: India v పాకిస్తాన్ |
చివరి T20I | 2022 19 జూన్: India v దక్షిణాఫ్రికా |
ఏకైక మహిళా టెస్టు | 1976 31 అక్టోబరు – 2 నవంబరు: India v వెస్ట్ ఇండీస్ |
మొదటి WODI | 1997 12 డిసెంబరు: ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా |
చివరి WODI | 2015 8 జూలై: India v న్యూజీలాండ్ |
మొదటి WT20I | 2014 30 నవంబరు: India v దక్షిణాఫ్రికా |
చివరి WT20I | 2016 28 మార్చి: శ్రీలంక v దక్షిణాఫ్రికా |
2022 19 జూన్ నాటికి Source: Cricinfo |
బెంగుళూరు నగరం నడిబొడ్డున, చుట్టూ సుందరమైన కబ్బన్ పార్క్, క్వీన్స్ రోడ్, MG రోడ్లతో ఉన్న ఈ స్టేడియం ఐదు దశాబ్దాల నాటిది. దీనికి 40,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.[1] టెస్టు క్రికెట్, వన్ డే ఇంటర్నేషనల్స్ (ODI), ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ (T20i) ఇతర ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్లతో పాటు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ స్టేడియం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ లకు ఇది హోమ్ గ్రౌండ్. ఇది కర్నాటక ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఈ స్టేడియాన్ని 100 సంవత్సరాల కాలానికి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)కి లీజుకు ఇచ్చారు.
గతంలో దీన్ని కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంగా పిలిచేవారు. ఆ తరువాత మాండ్యాకు చెందిన న్యాయవాది, మైసూర్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు అయిన మంగళం చిన్నస్వామి ముదలియార్కు నివాళిగా పేరు మార్చారు.[2] అతను నాలుగు దశాబ్దాల పాటు KSCAకి సేవలందించాడు. 1977 నుండి 1980 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.
స్టేడియం నడపడానికి అవసరమైన విద్యుత్లో ఎక్కువ భాగం ఉత్పత్తి చేయడానికి సౌర ఫలకాలను ఉపయోగించిన క్రికెట్ స్టేడియంలలో ప్రపంచంలోనే ఇది మొదటిది.[3] 2016లో నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసారు.[4] 2017 జనవరిలో తడిగా ఉన్న అవుట్ఫీల్డ్ కారణంగా మ్యాచ్లు కుదించబడకుండా ఉండటానికి గాలిని పంపుచేసే వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.[5]