గడ్డివాము
From Wikipedia, the free encyclopedia
వరి పైరు కోసి దానిని కంకుల గుండు లేదా ట్రాక్టర్తో నూర్చి దాని నుండి గింజలను తీసివేసి మిగిలిన గడ్డిని ఒక కుప్పగా వేస్తారు. దానినే గడ్డి వామి అంటారు. సాధారణంగా వరిగడ్డిని రాతి కూసాలపైన పందిరి వేసి దానిపైన వామి వేస్తారు. గడ్డితీయడానికి, దానికి నిచ్చెన వేసి ఎక్కి గడ్డిని తీసి పశువులకు వేస్తారు. ఉత్తరాంధ్రలో నేలపైనే గడ్డి వామును ఉంచుతారు.
వరిగడ్డిని పశువులకు దాణాగా ఉపయోగిస్తారు. సంవత్సరమంతా రైతులు వారి పశువుల మేతను భద్రపరచుకొనుటకు గడ్డిని కుప్పగా వేసి ఉంచుతారు. ఈ గడ్డి వాములోని గడ్డిని కొద్దికొద్దిగా తీసి పశువులకు మేతగా ఉపయోగిస్తారు.