జలాంతర ఛాయాచిత్రకళ
From Wikipedia, the free encyclopedia
జలాంతర ఛాయాచిత్రకళ (Underwater photography) అనేది నీటి లోపలనేవుండి ఛాయాచిత్రాల్ని తీయు ప్రక్రియ. ఇది సాధారణంగా స్కుబా డైవింగ్ చేస్తూ నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈత కొడుతూ గాని లేదా రిమోట్ తో నియంత్రించే కెమెరాల ద్వారా కూడా చిత్రపటాల్ని తీయవచ్చును. ఇది కూడా ఒక కళ, నీటిలోపలి జీవరాశుల అధ్యయనం కోసం చాలా కీలకమైనది.
ఛాయాచిత్రకళలో ఈ విభాగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. నీటిలో నివసించే జీవరాశులైన చేపలు, సముద్ర ప్రాణులు మాత్రమే కాకుండా అంతర్గతంగా ఉండే గుహలు లాంటి భౌగోళిక విషయాలను గూడా చిత్రించవచ్చును.