ది డూన్ స్కూల్
From Wikipedia, the free encyclopedia
ది డూన్ స్కూల్ (The Doon School) అన్నది ఉత్తరాఖండ్ రాష్ట్రములోని డెహ్రాడున్లో 70 acres (280,000 m2) విస్తీరణములో ఉన్న ఒక స్వతంత్ర పాఠశాల. 1935లో స్థాపించబడిన ఈ పాఠశాలను సతీష్ రంజన్ దాస్ స్థాపించారు. ఈ పాఠశాల యొక్క తొలి ప్రధాన ఉపాధ్యాయుడు ఆర్థర్ ఇ ఫుట్. ఇతర పాఠశాలలతో పోల్చితే ఈ పాఠశాల చిన్నది: ఇక్కడ సాధారణంగా 480 విద్యార్థులు ఉంటారు. ఈ పాఠశాల స్థాపించినప్పటి నుండి పట్టభద్రులైన విద్యార్థుల సంఖ్య ఐదువేలే ఉంటుందని అంచనా. మొత్తం 67 అధ్యాపకులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలు. అధ్యాపకులు:విద్యార్థులు నిష్పత్తి సుమారు 1:8 గా ఉంది. పాఠశాల 120 స్కాలర్షిప్పులను అందిస్తుంది. వీటిలో పాక్షిక, పూర్తి స్థాయి ఆర్థిక సహాయాలు ఉంటాయి. సుమారు 25% విద్యార్థులు ఈ ఆర్థిక సహాయాన్ని పొందుతారు. డూన్ బాలుర పాఠశాల; ఈ పాఠశాలలో చదివిన బాలికలు, పాఠశాల అధ్యాపకుల కూతుళ్ళు మాత్రమే. పాఠశాల ఆశయం యువ భారతీయులకు ఉదార విద్యను అందించడము, వారిలో లౌకికత్వం, క్రమశిక్షణ, సమానత్వం వంటి సిద్ధాంతాలను నెలకొల్పడం. ఈ పాఠశాలకు G20 పాఠశాలలు, రౌండ్ స్కొయర్ సంస్థలలో సభ్యత్వం ఉంది.
ద డూన్ స్కూల్ | |
---|---|
స్థానం | |
సమాచారం | |
Motto | విజ్ఞానమే మన జ్యోతి (Knowledge our light) |
Founded | 1935 సెప్టెంబరు 10 |
స్థాపకులు | సతీశ్ రంజన్ దాస్ |
ప్రధానోపాధ్యాయుడు | పీటర్ మెక్ లాలిన్ |
బోధనా సిబ్బంది | 67 |
విద్యార్ధుల సంఖ్య | 480 |
Campus | 69 ఎకరాలు (280,000 m²) |
Website | www.doonschool.com |