పుష్కర్
రాజస్తాన్ లోని నగరం / From Wikipedia, the free encyclopedia
పుష్కర్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీరు జిల్లాలోని ఒక ఊరు పుష్కర్ (Hindi: पुष्कर). అది అజ్మీరు జిల్లాకు వాయవ్యంలో 14 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 510 (1673) అడుగుల ఎత్తుగా ఉపస్థితమై ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కథనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్లో అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిలో అనేకం పురాతనమైనవి కాదు. ముస్లిమ్ దండయాత్రలలో అనేకం ధ్వంసం చేయబడ్డాయి. ధ్వంసం చేయబడిన ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. తరువాతి కాలంలో ధ్వంసం చేయబడిన ఆలయాలు పునర్నిర్మించబడ్డాయి.
?పుష్కర్ రాజస్థాన్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 26.5°N 74.55°E / 26.5; 74.55 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 510 మీ (1,673 అడుగులు) |
జిల్లా (లు) | అజ్మీరు జిల్లా |
జనాభా | 14,789 (2001 నాటికి) |
బ్రహ్మాలయానికి చెందిన అనేక దేవాలయాలు క్రీశ 14వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. ప్రపంచంలో అతి కొన్ని బ్రహ్మదేవుని ఆలయాలు మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నాయి. మిగిలిన బ్రహ్మదేవుని ఆలయాలు ఉత్తరప్రదేశ్ లోని బిదూరులో ఒకటి, భారతదేశంలో రాజస్థాన్ లోని బర్మర్ జిల్లా సమీపంలోని బలోత్రా అనే పల్లెటూరులో ఒకటి, మదర్ టెంపుల్ ఆఫ్ బిసాకిహ్ ఒకటి, ఇండోనేషియా లోని యోగ్యకర్త లోని ప్రంబనన్ ఒకటి. పుష్కర్6లో 52 ఘాట్లు భక్తుల స్నానార్ధము ఉన్నాయి. పుష్కర్లో ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేశదేశాల నుండి పర్యాటకులు పుష్కర్ కెమేల్ ఫెయిర్ అనే ఈ ఉత్సవానికి విచ్చేయడం ఒక ప్రత్యేకత. కొన్ని దశాబ్ధాలుగా పుష్కర్ యొక్క సహజ వాతావరణ కాలుష్యం కలత చెందవలసిన విధంగా పెరిగిందని భావించబడుతుంది. పర్యాటకుల సౌకర్యార్ధం అడవులను నరికివేయడం ఇందుకు ప్రధాన కారణమని భావించబడుతుంది.