మీరట్ కుట్ర కేసు
From Wikipedia, the free encyclopedia
మీరట్ కుట్ర కేసు బ్రిటీష్ ఇండియా 1929 మార్చిలో ప్రారంభించి, 1933లో నిర్ణయం వెలువడ్డ వివాదాస్పదమైన కోర్టు కేసు. భారత జాతీయోద్యమంపై కమ్యూనిస్టులు, కార్మిక ఉద్యమ ప్రభావాన్ని నిరోధించే లక్ష్యంతో ఈ కుట్ర కేసు ప్రారంభమైంది. భారతీయ రైల్వే సమ్మెను నిర్వహించినందుకు ముగ్గురు ఆంగ్లేయులు సహా పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులపై కేసును పెట్టారు. సుమారు నాలుగున్నర సంవత్సరాల పైగా కొనసాగిన ఈ కుట్ర కేసు విచారణలో 27 మంది కమ్యూనిస్ట్ నాయకులను దోషులుగా ప్రకటించి వారికి ఖైదు శిక్షలు విధించారు.