యంగ్ టర్క్స్ విప్లవం
1908 ఒట్టోమన్ సామ్రాజ్యంలో రాజ్యాంగ పాలన పునరుద్ధరణ / From Wikipedia, the free encyclopedia
ఒట్టోమాన్ సామ్రాజ్యంలో జరిగిన యంగ్ టర్క్ ఉద్యమం ద్వారా 1876 నాటి ఒట్టోమాన్ రాజ్యాంగాన్ని పున:స్థాపించడానికి, బహుళ పార్టీ వ్యవస్థను ఒట్టోమాన్ పార్లమెంటు కింద రెండు దశల ఎన్నికల విధానం, ఎన్నికల చట్టంలో ప్రవేశపెట్టడాన్నే యంగ్ టర్క్ విప్లవం (జూలై 1908) అంటారు. అంతకు మూడు దశాబ్దాల ముందు సుల్తాన్ మూడవ అబ్దుల్ హమీద్ రాజ్యాంగబద్ధ నియంతృత్వాన్ని, తద్వారా తొలి రాజ్యాంగ శకాన్ని ప్రారంభించినా అది కేవలం రెండేళ్ళు మాత్రమే సాగి రద్దయింది. జూలై 24, 1908న, సుల్తాన్ రెండవ అబ్దుల్ హమీద్ ఉద్యమానికి లొంగి, ఆ రాజ్యాంగ పున:స్థాపనకు ఆదేశించడంతో రెండవ రాజ్యాంగ శకం ప్రారంభమయ్యింది.
ఒకప్పుడు రహస్య కార్యకలాపాలకు పరిమితమైన సంస్థలు రాజకీయ పార్టీలను స్థాపించాయి. [1] వాటిలో కమిటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రస్ (CUP), ఫ్రీడం అండ్ అకార్డ్ పార్టీ లేదా లిబరల్ యూనియన్/లిబరల్ ఎన్టిటీ ప్రధాన పార్టీలు. అలాగే ఒట్టోమాన్ సోషలిస్ట్ పార్టీ వంటి చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. దీనికి మరోవైపు జాతులకు సంబంధించిన పార్టీలు ప్రధానంగా పీపుల్స్ ఫెడరేటివ్ పార్టీ (బల్గేరియన్ సెక్షన్), బల్గేరియన్ కాన్స్టిట్యూషనల్ క్లబ్స్, జ్యూయిష్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ ఇన్ పాలస్తీనా, అల్-ఫతాత్, ఆర్మెనెకన్ పార్టీ, సోషల్ డెమోక్రాట్ హన్చకియన్ పార్టీ, ఆర్మేనియన్ రివల్యూషనరీ పార్టీ వంటివి ఉన్నాయి. వ్యాపారులు, సంపన్నులు ప్రధానంగా ఉన్న ఆర్మీనియన్ నేషనల్ అసెంబ్లీ స్థానాన్ని తీసుకుంటూ, ఒకప్పుడు చట్టవ్యతిరేకంగా గుర్తించబడ్డ ఆర్మీనియన్ రివల్యూషన్ ఫెడరేషన్, ఆర్మేనియన్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అయింది. [2] ఈ ఘటనను నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపుకు ప్రపంచం వేసిన ప్రధానమైన అడుగుల్లో ఒకటిగా చరిత్రకారులు భావిస్తారు.