రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు
From Wikipedia, the free encyclopedia
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు భారతదేశ పార్లమెంటు ఎగువ సభలో ప్రతిపక్షానికి నాయకత్వం వహించే సభ్యుడు . రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంలో లేని రాజ్యసభలో అతిపెద్ద రాజకీయ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్. 1987లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్యాంనందన్ మిశ్రాను రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నియమితుడయ్యాడు. 1977లో భారత పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుర్తింపునిచ్చే చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు లభించాలంటే సభలోని మొత్తం స్థానాల్లో 1/10వ వంతు స్థానాలు పొంది ఉండాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతకు కేంద్ర కేబినెట్ మంత్రికి లభించే వసతి, హోదా లభిస్తాయి. ఈ చట్టం చేసిన అనంతరం రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కమలాపతి త్రిపాఠి (1977) నిలిచాడు.