శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు 2015
From Wikipedia, the free encyclopedia
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటించింది. ఈ పర్యటన 2015 ఆగస్టు 6 నుండి సెప్టెంబరు 1 వరకు కొనసాగినది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్ట్ మ్యాచ్ లతో పాటుగా ఒక పర్యటన మ్యాచ్ (టూర్ మ్యాచ్) ఆడియున్నది.[1] ఇది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని శ్రీలంక ఆటగాడైన కుమార సంగక్కర జూన్ 27న ప్రకటించాడు.[2] భారత్ ఈ పర్యటన ఆట శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ XI తో మూడు రోజుల ఆటతో మొదలైనది. పర్యటనలోని మూడు టెస్ట్ మ్యాచ్లు గాలే, పి శర ఓవల్, ఎస్ఎస్సి కొలంబో మైదానములలో ఆడియున్నది.[3]
శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు 2015 | |||||
శ్రీలంక | భారతదేశం | ||||
రోజులు | 6 ఆగష్టు 2015 – 1 సెప్టెంబరు 2015 | ||||
నాయకులు | ఏంజెలో మాథ్యూస్ | విరాట్ కోహ్లి | |||
Test series | |||||
ఫలితం | భారతదేశం 3-ఆటల సిరీస్ ను 2–1 తో గెలుచుకున్నది | ||||
అత్యదిక పరుగులు | ఏంజెలో మాథ్యూస్ (339) | విరాట్ కోహ్లి (233) | |||
అత్యదిక వికెట్లు | రవిచంద్రన్ అశ్విన్ (21) | ధామ్మిక ప్రసాద్ (15) | |||
మెరుగైన ఆటను ప్రదర్శించిన ఆటగాడు(ళ్ళు) | రవిచంద్రన్ అశ్విన్ (భారత్) |
భారత క్రికెట్ జట్టు ఆగస్టు 4న శ్రీలంకకు చేరుకున్నది.[4]
ఈ సిరీస్ లో ముగ్గురు వేరువేరు ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ (134), లోకేష్ రాహుల్ (108), చేటేశ్వర్ పూజారా (145) మూడు శతకాలను నమోదు చేసారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఐదవ సారి. చివరి సారిగా 1970 ఆషేస్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు నమోదు చేసారు.[5]
భారత్ ఈ మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ను 2–1 తో గెలుచుకున్నది. 1993 తరువాత భారత్ శ్రీలంకలో ఇదే తొలిసారి సిరీస్ ను గెలవడము. అలాగే 2001 తరువాత విదేశాలలో సిరీస్ గెలవడము కూడా ఇదే తొలిసారి. చివరగా 2011 లో వెస్ట్ ఇండీస్ పైన సిరీస్ ను వెస్ట్ ఇండీస్ లో గెలుచుకున్నది[6]