షాహ్ నామా
From Wikipedia, the free encyclopedia
షానామా లేక షాహ్ నామా లేక షాహ్నామెహ్ ( ఫార్సీ: شاهنامه pronounced [ʃɒːhnɒːˈme] ; అనువాదం: "రాజుల పుస్తకం" ) [lower-alpha 1] పర్షియన్ కవి ఫిరదౌసి సా.శ. 977 నుండి 1010 వరకు రాసిన సుదీర్ఘ ఇతిహాసం. ఇది గ్రేటర్ ఇరాన్ అని పిలిచే విస్తారమైన సాంస్కృతిక ప్రదేశానికి జాతీయ ఇతిహాసం. డిస్టిచ్లు అని పిలిచే ద్విపదల్లో (రెండు పాదాల పద్యం) ఈ ఇతిహాసం కూర్చబడింది. దాదాపు 50 వేల డిస్టిచ్లు కలిగివున్న ఈ షాహ్నామా సుమారు 50,000 " డిస్టిచ్లు " లేదా ద్విపదలు (రెండు-లైన్ పద్యాలు) కలిగి ప్రపంచంలో. అత్యంత సుదీర్ఘమైన ఇతిహాస కావ్యాల్లో ఒకటిగా నిలిచింది.[2] ఇది ప్రధానంగా మిథికల్ లేక పౌరాణిక సాహిత్యం, ఐతే దీనిలో కొంతవరకూ ప్రపంచం ఏర్పడినప్పటి నుంచి ఇస్లామీయ దండయాత్ర, విజయం వరకూ పర్షియన్ సామ్రాజ్యపు చరిత్ర పొందుపరిచాడు కవి. పర్షియన్ సంస్కృతి ప్రభావం కలిగిన ఇరాన్, అజర్బైజాన్, ఆఫ్ఘనిస్తాన్, జార్జియా, అర్మేనియా, టర్కీ, డాగేస్టాన్ దేశాలు కలిగిన విస్తారమైన ప్రాంతం దీన్ని జాతీయ ఇతిహాసంగా ప్రస్తుతిస్తుంది.
రాజుల పుస్తకం | |
by ఫిరదౌసి | |
వాస్తవ శీర్షిక | شاهنامه |
---|---|
రాసినవారు | 977–1010 CE |
దేశం | ఇరాన్ |
భాష | క్లాసికల్ పర్షియన్ |
విషయము(లు) | పర్షియన్ పురాణేతిహాసాలు, ఇరాన్ చరిత్ర |
కళాప్రక్రియ | ఇతిహాస కావ్యం |
Meter | 22 శబ్దాలతో కూడిన రెండు లైన్లు, ప్రాస కలిగిన రెండు పాదాల పద్యాలు (ద్విపదలు) (bahr-i mutaqarib-i mahzuf)[1] |
Publication date | 1010 |
Published in English | 1832 |
Media type | మాన్యుస్క్రిప్ట్ |
వరుసలు | c. 50,000 మాన్యుస్క్రిప్టుని బట్టి |
Preceded by | ఖ్వాదే-నమగ్ |
ఈ రచన పర్షియన్ సంస్కృతిలోనూ, పర్షియన్ భాషలోనూ అత్యంత ప్రాముఖ్యత కలిగి కేంద్ర స్థానంలో నిలుస్తోంది. ఇది సాహిత్యపరంగా కళాఖండంగా, ఇరాన్ జాతీయత, సాంస్కృతికకు చిహ్నంగా నిలిచింది. జొరాస్ట్రియనిజం మతంలోనూ ఇది చాలా ముఖ్యమైనది. దీనిలో ఆ మతం ప్రారంభ వికాసాల నుంచి ఇరాన్లో జొరాస్ట్రియన్ ప్రభావానికి తుదివాక్యం పలికిన చివరి సాసానియన్ చక్రవర్తి మరణం వరకూ వివిధ చారిత్రక అంశాలను పొందుపరిచి ఉంది.