సాలిమా సుల్తాను బేగం
From Wikipedia, the free encyclopedia
సలీమా సుల్తాన్ బేగం (ఉర్దూ: سلیمہ سلطان) (23 ఫిబ్రవరి 1539 – 2 జనవరి 1613), బాబర్ మనవరాలు.[2] మొఘలు చక్రవర్తి అక్బరు నాల్గవ భార్య[3]బాబరు చక్రవర్తి మనుమరాలు.
సాలిమా సుల్తాను బేగం سلیمہ سلطان بیگم | |
---|---|
జననం | 23 February 1539 |
మరణం | 1613 జనవరి 2(1613-01-02) (వయసు 73) Agra, Mughal Empire (modern day India) |
Burial | Mandarkar Garden, Agra |
Spouse | Bairam Khan (m. 1557–1561) Akbar (m. 1561–1605 in Jalandhar)[1] |
House | Timurid (by birth) |
తండ్రి | Nuruddin Muhammad Mirza |
తల్లి | Gulrukh Begum |
మతం | Islam |
సలీమా అక్బరు అత్త (తండ్రి సోదరి) గుల్రుఖు బేగం, నూరుద్దీను ముహమ్మదు మీర్జా (కన్నౌజు రాజప్రతినిధి) కుమార్తె. ఆమె మామయ్య హుమయూను ఆమెను ముందుగా అక్బరు రీజెంటు బైరం ఖానుకు ఇచ్చి వివాహం చేసాడు. హుమయూను కొరకు బైరం చేసిన అధిగమించిన సేవలకు వధువును బహుమతిగా ఇచ్చి ఉండవచ్చు. ఈ జంట మధ్య సుమారు నలభై సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది.1557లో హుమయూను మరణం తరువాత మూడవ మొఘలు చక్రవర్తిగా సింహాసం అధిష్ఠించిన అక్బరు ఆమెను మూడవభార్యగా వివాహం చేసుకున్నాడు. ఏది ఏమయినప్పటికీ 1561 లో బైరం ఖాను ఆఫ్ఘన్ల బృందంచేత హత్య చేయబడినందున సంతానరహితమైన ఈ సంక్షిప్త దాంపత్యం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఆయన మరణం తరువాత సలీమా తరువాత తన మొదటి బంధువు అక్బరును వివాహం చేసుకున్నది.
సలీమా అక్బరు సీనియరు ర్యాంకింగు భార్య, ఆమె భర్త అక్బరు మీద, ఆయన కుమారుడు జహంగీరు మీద చాలా ప్రభావం చూపింది. [4] ఆమె తన భర్త పాలనలో, ఆయన వారసుడు (జహంగీరు) పాలనలో మొఘలు రాజసభలో ప్రధాన రాజకీయ ప్రభావాన్ని చూపింది. అయినప్పటికీ చరిత్రలలో ఆమె పేరు ఒక పాఠకురాలిగా, కవిగా మఖ్ఫీ (مخفی, "హిడెన్ వన్") అనే మారుపేరుతో వ్రాసింది. జహంగీరు క్షమించమని అక్బరు వేడుకుంటుంది.
ఆమె ప్రారంభ మొఘలు చరిత్రలో నిలుస్తుంది. ఆమె పరిజ్ఞానం ఆమెకు "యుగం ఖాదీజా" (ఖాదీజా-ఉజ్-జమాని) బిరుదు ఇచ్చి గౌరవించింది.[5]