1983 క్రికెట్ ప్రపంచ కప్
From Wikipedia, the free encyclopedia
1983 క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంటులో జరిగిన 3వ పోటీ. దీన్ని అధికారికంగా ప్రుడెన్షియల్ కప్ '83 అన్నారు. 1983 జూన్ 9 నుండి జూన్ 25 వరకు ఇంగ్లాండ్, వేల్స్లలో జరిగింది. ఇందులో భారతదేశం ఛాంపియన్ అయింది. ఈ పోటీలో ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి. ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్ లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. ప్రిలిమినరీ మ్యాచ్లు, ఒక్కొక్కటి నాలుగు జట్లతో కూడిన రెండు గ్రూపులుగా జరిగాయి. వీటిలో ప్రతి దేశం తన గ్రూపులోని ఇతర జట్లతో రెండుసార్లు ఆడింది. ఒక్కో గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి.
ఈ పోటీ లోని మ్యాచ్లలో ఒకో ఇన్నింగ్స్కు 60 ఓవర్లు ఉన్నాయి. సాంప్రదాయికంగా ధరించే తెల్లని దుస్తులతో, ఎరుపు రంగు బంతులతో ఆడారు. మ్యాచ్లన్నీ పగటిపూటే జరిగాయి.