ఎఱ్రాప్రగడ
14వ శతాబ్దపు తెలుగు కవి / From Wikipedia, the free encyclopedia
ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. నన్నయ భారతాన్ని చదివి, ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయే వ్రాసాడేమో అనిపిస్తుంది. అలాగే తిక్కన భారతము చదివి ఎర్రన వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కనే వ్రాసాడేమో అనిపిస్తుంది.
ఈ వ్యాసంలో అస్పష్టమైన, సంశయాత్మక పదాలను వాడారు: ఇలాంటి పదాలు సాధరణంగా పక్షపాతంతో కూడుకుని గానీ, నిర్ధారించుకోలేని సమాచారంతో కూడుకుని గానీ ఉంటాయి. |
సంస్కృతంలో రాసిన మహాభారతానికి తెలుగు అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎర్రన 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతనిని ఎర్రయ్య, ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది.