ఎఱ్ఱగుడిపాడు శాసనం
From Wikipedia, the free encyclopedia
ఎఱ్ఱగుడిపాడు శాసనం కడప జిల్లా యర్రగుంట్ల మండలం ఎర్రగుడిపాడు గ్రామం లోని చెన్నకేశవస్వామి ఆలయంలో ఉంది. దీన్ని సా.శ. 575 లో రేనాటి చోళరాజు ధనంజయ ఎరికళ్ ముత్తురాజు వేయించాడు. భాషాశాస్త్రవేత్తల దృష్టిలో ఇది తొలి తెలుగు శాసనం., తొలి తెలుగు గద్య (వచన) శాసనం కూడా. ఇది తెలుగువాడు తెలుగు మాటల్లో రాసుకొన్న మొదటి శాసనం. ఇది తెలుగు వాక్య రచన కనిపించే మొదటి శాసనం. ఈ శాసనంతోనే తెలుగు శాసనభాషా యుగం ప్రారంభమైంది.[1]