గురజాడ అప్పారావు
తెలుగు రచయిత, కవి. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి / From Wikipedia, the free encyclopedia
గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు *కవి శేఖర* అనే బిరుదు ఉంది.
త్వరిత వాస్తవాలు గురజాడ అప్పారావు, జననం ...
గురజాడ అప్పారావు | |
---|---|
జననం | అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి తాలూకా, యస్. రాయవరం గ్రామం |
మరణం | నవంబరు 30, 1915 |
నివాస ప్రాంతం | అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి తాలూకా, యస్. రాయవరం గ్రామం |
ఇతర పేర్లు | గురజాడ |
వృత్తి | రచయిత సంఘ సంస్కర్త సాహితీకారుడు హేతువాది అభ్యుదయ కవి |
ఉద్యోగం | రచయిత, కవి |
ప్రసిద్ధి | గురజాడ కన్యాశుల్కం |
జీతం | 500 |
పదవి పేరు | తెలుగు భాష మహాకవి |
మతం | హిందూ |
భార్య / భర్త | అప్పల నరసమ్మ |
పిల్లలు | ఓలేటి లక్ష్మి నరసమ్మ వెంకట రామదాసు పులిగెడ్డ కొండయ్యమ్మ |
తండ్రి | వెంకట రామదాసు |
తల్లి | కౌసల్యమ్మ |
మూసివేయి