ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి
ఆంధ్రప్రదేశ్ సంస్థ / From Wikipedia, the free encyclopedia
వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కొన్ని అకాడమీలను స్థాపించింది. ప్రస్తుతం వీటి సంఖ్య ఎనిమిది. వాటిలో తెలుగు సాహిత్యం కోసం సాహిత్య అకాడమీ రూపొందినది.
కేంద్ర సాహిత్య అకాడమీ (నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్)కి అనుబంధంగా 1957 వ సంవత్సరలో స్థాపించబడినది ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ. దీని విధులు ఈ విధంగా ఉంటాయి.
- తెలుగు భాషా సాహిత్యాలను ప్రోత్సహించటం
- పరిశోధన కార్యక్రమాలను అభివృద్ధి పరచటం
- నిఘంటువులు, ఎన్ సైక్లోపిడియాలు, మూలం(రెఫరెన్స్) పుస్తకాలు మొదలగునవి ప్రచురించడం
- వ్యక్తులకు లేదా సాహితీ సంస్థలకు సహకారాన్ని అందించడం.
- తెలుగు రచయితల క్రియాత్మక, విమర్శనాత్మక కార్యకలాపాలకు బహుమతులివ్వడం
- ఆధునిక శాస్త్రీయ విధానంలో వివరణాత్మకమైన తెలుగు నిఘంటువును, వ్యాకరణ పదకోశాన్ని తయారు చేయడం
- సాధారణ ప్రజలలో ఉత్తమ సాహిత్య పఠనాన్ని మెరుగు పరచడం
ఇలాంటి వాటితో సాహిత్య అకాడమీ పనిచేస్తుంది.