సింధీ భాష
From Wikipedia, the free encyclopedia
సింధీ /ˈsɪndi/[5] (سنڌي, सिन्धी, , ਸਿੰਧੀ) చారిత్రకంగా సింధ్ ప్రాంతంలో, సింధీ ప్రజలు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్సుకు ఇది అధికారిక భాష.[6][7][8] భారత దేశంలో ఏ రాష్ట్రానికి సింధీ భాష అధికారిక భాషగా లేదు, కానీ భారత ప్రభుత్వం గుర్తించిన షెడ్యూల్డ్ భాషల్లో ఇది ఒకటి.[9][10]
సింధీ سنڌي / सिन्धी / / ਸਿੰਧੀ | ||
---|---|---|
మాట్లాడే దేశాలు: | సింధ్ | |
ప్రాంతం: | దక్షిణ ఆసియా | |
మాట్లాడేవారి సంఖ్య: | 2 కోట్ల 50 లక్షల మంది | |
భాషా కుటుంబము: | ఇండో-ఇరానియన్ ఇండో-ఆర్యన్ వాయువ్య భాషలు సింధీ భాషలు సింధీ | |
వ్రాసే పద్ధతి: | పర్షియో-అరబిక్ లిపి, దేవనాగరి లిపి, ఖుబబది లిపి, లండా లిపి, గురుముఖీ లిపి[1] | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | Pakistan (సింధ్)[2][3][4] India | |
నియంత్రణ: | సింధీ లాంగ్వేజ్ అధారిటీ (పాకిస్తాన్), నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సింధీ లాంగ్వేజ్ (భారతదేశం) | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | none | |
ISO 639-2: | — | |
ISO 639-3: | — | |
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
సింధీ భాష మాట్లాడేవారిలో ఎక్కువశాతం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్సులోనూ, భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలోనూ, మహారాష్ట్రలోని ఉల్హాస్ నగర్ ప్రాంతంలోనూ ఉన్నారు. మిగిలిన సింధీ భాషీయుల్లో భారతదేశ విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వలసవచ్చి స్థిరపడ్డ సింధీ హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింధీ డయాస్పోరా ప్రజలు ఉన్నారు. ఈ క్రమంలో పైన ప్రస్తావించిన ప్రాంతాలు మాత్రమే కాక పాకిస్తాన్లోని బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్సులు, భారతదేశంలోని రాజస్థాన్, పంజాబ్, సింధీలు వలసవెళ్ళిన హాంగ్కాంగ్, ఒమన్, ఇండోనేషియా, సింగపూరు, యుఎఇ, రష్య, యుకె, అమెరికా వంటి దేశాల్లోనూ సింధీ మాట్లాడతారు.[11]