అడాయీ యోనత్
From Wikipedia, the free encyclopedia
అడాయి యోనత్ (Hebrew: עדה יונת, మూస:IPA-he) (జననం 1939 జూన్ 22) [1] ఇటాలియన్ క్రిస్టలోగ్రాఫర్ అయిన ఆమె రిబోసం నిర్మాణం గురించి చేసిన పరిశోధనలతో అంతర్జాతీయంగా గుర్తించబడుతుంది. ఆమె ప్రస్తుతం " హెలెన్ అండ్ మిల్టన్ ఏ కిమ్మెల్మాన్ బయోమాలిక్యులర్ స్ట్రక్చర్ , అసెంబ్లీ ఆఫ్ ది వైజ్మెన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంస్ డైరెక్టర్గా బాధ్యత వహిస్తుంది. 2009 లో ఆమె రసాయనశాస్త్రంలో " నోబెల్ బహుమతి " అందుకున్నది. ఆమె ఈ బహుమతిని వెంకటరామన్ రామక్రిష్ణన్, థోమస్ ఏ స్టెయిజ్ లతో కలిసి అందుకున్నది. ఆమె 10 ఇజ్రాయిల్ నోబెల్ బహుమతి గ్రహీతలలో మొదటి మహిళా నోబెల్ పురస్కార గ్రహీతగా గుర్తించబడుతుంది.[2] అలాగే మిడిల్ ఈస్ట్లో సైంస్లో నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళగా కూడా గుర్తించబడుతుంది.[3] 45 సంవత్సరాలలో రసాయశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళగా కూడా గుర్తించబడింది. అయినప్పటికీ ఆమె మహిళగా నోబెల్ బహుమతి అందుకోవడంలో ప్రత్యేకత ఏమీ లేదని అభిప్రాయపడింది.[4]