అబ్రహాం లింకన్ హత్య
From Wikipedia, the free encyclopedia
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ American 16th p resident అబ్రహాం లింకన్ ఏప్రిల్ 14, 1865 నాడు ఫోర్డ్స్ థియేటర్ లో అవర్ అమెరికన్ కజిన్ అన్న నాటకానికి హాజరవుతున్నప్పుడు గుడ్ ఫ్రైడే నాడు జాన్ విల్కీస్ బూత్ చేత హత్యకు గురయ్యారు. అమెరికా అంతర్యుద్ధం ముగిసిపోతూన్న సమయంలో ఈ హత్య జరిగింది.[1] నార్త్ వర్జీనియాకు చెందిన కాన్ఫిడరేట్ సైన్య జనరల్ రాబర్ట్ ఇ. లీ లెఫ్టినెంట్ జెనరల్ యులిసెస్ ఎస్. గ్రాంట్, యూనియన్ ఆర్మీ ఆఫ్ పోటోమాక్ కు లొంగిపోయిన అయిదు రోజులకు ఈ హత్య జరిగింది.
అబ్రహాం లింకన్ హత్య | |
---|---|
Part of అమెరికా అంతర్యుద్ధం | |
ప్రదేశం | ఫోర్డ్స్ థియేటర్, వాషింగ్టన్ డి.సి. |
తేదీ | ఏప్రిల్ 14, 1865 (1865-04-14) 10:15 p.m. (ఈస్టర్న్ స్టాండర్డ్ టైం) |
లక్ష్యం |
|
దాడి రకం |
|
ఆయుధాలు |
|
మరణాలు | 1 (అబ్రహాం లింకన్) |
ప్రాణాపాయ గాయాలు | 4 |
నేరస్తులు | జాన్ విల్కీస్ బూత్, సహ కుట్రదారులు |
దాడికి కారకులు | యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాలకవర్గంలోని ముఖ్యులను హత్యచేసి ప్రభుత్వం అస్థిరపరచడం కాన్ఫెడరసీ స్థాపించడం |
హత్యకు గురయిన తొలి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్.[2] అంతకు 30 సంవత్సరాల ముందు 1835లో మరో ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ పై విఫలమైన హత్యాయత్నం జరిగింది, ఆపైన 1864 ఆగస్టులో గుర్తుతెలియని హంతకుడు లింకన్ పైనే ఒక హత్యాయత్నం చేశారు. అంతర్యుద్ధంలో ఓటమి పాలైన కాన్ఫిడరేట్ ను పున:స్థాపించే పెద్ద కుట్రలో భాగంగా ప్రఖ్యాత రంగస్థల నటుడు జాన్ విల్కీస్ బూత్ లింకన్ హత్యకు కుట్ర, అమలు స్వయంగా చేపట్టారు.
బూత్ తో పాటుగా ఈ కుట్రలో భాగస్తులు లూయీస్ పావెల్, డేవిడ్ హెరాల్డ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ విలియం హెచ్. సీవార్డ్ ను చంపేందుకు, జార్జ్ అట్జెరోట్ ఉపాధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ ను హత్యచేసేందుకు నియుక్తులైనారు. వెనువెంటనే పరిపాలనలోని ముగ్గురు ముఖ్యులను చంపడం ద్వారా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం కొనసాగింపును దెబ్బతీసేందుకు కుట్రజరిగింది.
అవర్ అమెరికన్ కజిన్ అన్న నాటకాన్ని చూస్తున్నప్పుడు వాషింగ్టన్ డి.సి.లోని ఫోర్డ్స్ థియేటర్లో లింకన్ ను తుపాకీతో కాల్చారు. తర్వాతి రోజు ఉదయం 7.22 నిమిషాలకు లింకన్ మరణించారు.[3] కుట్రదారుల మిగతా కుట్ర అంతా దెబ్బతింది. కుట్రదారుల్లో పావెల్ మాత్రమే సీవార్డును గాయపరచగలిగాడు. జాన్సన్ ను చంపేందుకు నియుక్తమైన అట్జెరోట్ మానసిక స్థైర్యాన్ని కోల్పోయి పారిపోయాడు. అబ్రహాం లింకన్ అంత్యక్రియలు, ఖననం జాతీయ సంతాపదినాలుగా ప్రకటించారు.