ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా (జనాభా ప్రకారం)
From Wikipedia, the free encyclopedia
ఈ జాబితా 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితా గురించి, భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్ కార్యాలయం ద్వారా ఈ గణాంకాలు నిర్వహించబడ్డాయి.2011 జనాభా లెక్కల ప్రకారం లక్షకు మించిన జనాభా కలిగియున్న జనావాస ప్రాంతాలను నగరం అని నిర్వచించారు.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 నగరాలున్నాయి, ఇందులో 15 నగరపాలకసంస్థలు, 9 పురపాలకసంఘాలు ఉన్నాయి. భీమునిపట్నం, అనకాపల్లి మునిసిపాలిటీల పరిసర పట్టణాలను విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో విలీనం చేసిన తర్వాత 1,728,128 జనాభాతో విశాఖపట్నం అత్యధిక జనాభా కలిగిన నగరంగా రూపుదిద్దుకుని ఇది ఇది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) గా అప్గ్రేడ్ చేయబడింది.విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీస్ మిషన్ కింద భారత ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తోంది.