ఎస్.కె.పొట్టెక్కాట్
మలయాళం రచయిత / From Wikipedia, the free encyclopedia
ఎస్.కె.పొట్టెక్కాట్ గా ప్రాచుర్యం చెందిన శంకరన్ కుట్టి పొట్టెక్కాట్, (1913 మార్చి 14 – 1982 ఆగస్టు 6) కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళ రచయిత. ఈయన దాదాపు ఆరవై దాకా రచనలు చేశాడు. అందులో పది నవలలు, ఇరవైనాలుగు కథానికా సంకలనాలు, మూడు కవితాసంపుటాలు, పద్దెనిమిది యాత్రాసాహిత్య రచనలు, నాలుగు నాటకాలు, ఒక వ్యాససంపుటం, రెండు జ్ఞాపకాలతో కూడిన రచనలు ఉన్నాయి. పొట్టెక్కాట్ 1961లో ఒరు తెరువింటె కథ (ఒక వీధి కథ) నవలకై కేరళ సాహిత్య అకాడమీ అవార్డును పొందాడు.[1] 1980లో ఒరు దేషింటె కథ (ఒక ప్రాంతపు కథ) నవలకు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందాడు. ఇది ఒక అవార్డులు పొందిన చలనచిత్రంగానూ రూపొందించబడింది.[2] ఈయన రచనలు భారతీయ భాషలన్నింటితో పాటు ఆంగ్లము, ఇటాలియన్, రష్యన్, జర్మన్, ఛెక్ భాషలలోకి అనువదించబడ్డాయు.
త్వరిత వాస్తవాలు ఎస్.కె.పొట్టెక్కాట్, పుట్టిన తేదీ, స్థలం ...
ఎస్.కె.పొట్టెక్కాట్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1913-03-14)1913 మార్చి 14 కొట్టులి కొయికోడ్, కేరళ, భారతదేశం |
మరణం | 1982 ఆగస్టు 6(1982-08-06) (వయసు 69) కేరళ, భారతదేశం |
వృత్తి | ఉపధ్యాయుడు, రచయిత, పార్లమెంటు సభ్యుడు |
రచనా రంగం | నవల, యాత్రాసాహిత్యం, కథానికలు, నాటకాలు, వ్యాసాలు, కవితలు |
గుర్తింపునిచ్చిన రచనలు | ఒరు దేశతింటే కథ, ఒరు తెరువింటె కథ,"నాదాన్ ప్రేమం |
పురస్కారాలు | జ్ఞానపీఠ పురస్కారం, సాహిత్య అకాడమీ బహుమతి |
మూసివేయి