కాంగేర్ లోయ జాతీయ వనం
From Wikipedia, the free encyclopedia
కాంగేర్ లోయ జాతీయ అరణ్యం చత్తీస్గఢ్లోని జగదల్పుర్ పట్టణానికి దక్షిణాన 35 కిలో మీటర్లు దూరాన ఉన్న జాతీయ అరణ్యం. ఈ అరణ్యం పులులు, చిరుత పులులు, అడవి కోళ్ళు, ఇతర జంతువులు, పక్షులకి ప్రసిద్ధి. తీరత్గఢ్ జలపాతాలు, కోతుంసర్ గుహలు, కైలాస గుహలు ఈ అరణ్యంలోనే ఉన్నాయి. 1982 లో ప్రభుత్వం దీన్ని జాతీయ వనంగా గుర్తించింది. చత్తీస్ గఢ్ రాష్ట్ర పక్షి అయిన బస్తరు కొండ మైనాకు ఈ వనం నెలవు.
కాంగర్ లోయ జాతీయ వనం | |
---|---|
కాంగర్ లోయ జాతీయ వనం | |
IUCN category II (national park) | |
ప్రదేశం | జగదల్ పూర్, చత్తీస్ గఢ్ |
సమీప నగరం | జగదల్ పూర్ |
విస్తీర్ణం | 200 కి.మీ2 (77 చ. మై.) |
స్థాపితం | 1982 |
పాలకమండలి | Conservator of Forest |
http://www.kvnp.in |
34 కి.మీ. పొడవైన కాంగేర్ లోయలో ఈ వనాన్ని స్థాపించారు. దీని విస్తీర్ణం సుమారు 200 చ.కి.మీ. ఇది ఎక్కువగా పర్వత ప్రాంతం. ఈ పార్కు గుండా ప్రవహించే కాంగేర్ నది వలన దీనికి ఈ పేరు వచ్చింది. ఈ వనంలో మైదాన ప్రాంతం, పర్వత ప్రాంతం, పీఠభూమి ప్రాంతం, లోయలు, వాగుల వంటి వివిధ భౌగోళిక విశేషాలున్నాయి. అనేక జాతుల వృక్ష జంతు జాలానికి ఈ వనం నెలవు. పార్కులో కొన్ని గిరిజన జాతుల ప్రజలు కూడా అవాసముంటారు.