సాహిత్య అకాడమీ
భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ / From Wikipedia, the free encyclopedia
సాహిత్య అకాడమీ (ఆంగ్లం: Sahitya Akademi) (హిందీ:साहित्य अकादमी ) (తెలుగు: సాహిత్య అకాడెమీ) భారతదేశానికి చెందిన ఒక సంస్థ. సాహిత్య పోషణకు, సహకారానికి, ప్రోత్సాహం కొరకు స్థాపించబడింది. భారతీయ భాషలలో ప్రముఖంగా సేవచేసిన వారికి ఇది సన్మానిస్తుంది. దీనిని మార్చి 12 1954, న స్థాపించారు. దీని నిర్వహణ భారత ప్రభుత్వం చేపడుతున్నది. సాహిత్య అకాడెమీ, సెమినార్లు, వర్క్షాపులు, సమావేశాలు, సదస్సులు చేపడుతుంది. పరిశోధకులకు, రచయితలకు, కవులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. రచనలకు, ముద్రణలకునూ ప్రోత్సాహకాలనిస్తుంది. పురస్కార గ్రహీతలకు రూ. 50,000 లు బహుమానం ప్రకటిస్తుంది. దీని గ్రంథాలయం, భారత్ లోనే అతిపెద్ద బహుభాషా గ్రంథాలయం. రెండు, ద్విమాస పత్రికలు ప్రచురిస్తూవుంది. అవి -- భారతీయ సాహిత్యం (ఆంగ్లంలో), సమకాలీన్ భారతీయ సాహిత్య్ (హిందీలో).