From Wikipedia, the free encyclopedia
కోటె ది ఐవొరె : దీనిని ముందు "ఐవరీ కోస్ట్" అని పిలిచేవారు. అధికారిక నామం "కోటె ది ఐవొరె". పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. దీని వైశాల్యం 3,22,462 చ.కి.మీ. దీనికి పశ్చిమసరిహద్దులో లైబీరియా, గినియా, ఉత్తరసరిహద్దులో మాలి, బుర్కినా ఫాసో, తూర్పుసరిహద్దులో ఘనా, గినియా అఖాతం, దక్షిణసరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈ దేశపు జనాభా 1998 లెక్కల ప్రకారం 1,53,66,672.[5] 2008 లో జనాభా అంచనా 1,83,73,060.[2]
République de Côte d'Ivoire రిపబ్లిక్ ఆఫ్ కోటె ది ఐవొరె |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Union - Discipline - Travail" "Unity, Discipline and Labour" (translation) |
||||||
రాజధాని | Yamoussoukro 6°51′N 5°18′W | |||||
అతి పెద్ద నగరం | ఆబిద్జాన్ | |||||
అధికార భాషలు | ఫ్రెంచి భాష | |||||
ప్రజానామము | ఐవోరియన్ | |||||
ప్రభుత్వం | రిపబ్లిక్కు | |||||
- | రాష్ట్రపతి | Laurent Gbagbo[1] | ||||
- | ప్రధానమంత్రి | Guillaume Soro[1] | ||||
Independence | ఫ్రాన్సు నుండి | |||||
- | Date | ఆగస్టు 7 1960 | ||||
- | జలాలు (%) | 1.4[2] | ||||
జనాభా | ||||||
- | 2008 అంచనా | 18,373,060[2] | ||||
- | 1999 జన గణన | 10,815,694[3] | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $34.048 billion[4] | ||||
- | తలసరి | $1,640[4] | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $23.508 బిలియన్లు[4] | ||||
- | తలసరి | $1,132[4] | ||||
జినీ? (2002) | 44.6 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (5255) | 0.432 (low) (166వది) | |||||
కరెన్సీ | en:West African CFA franc (XOF ) |
|||||
కాలాంశం | గ్రీన్విచ్ (UTC+0) | |||||
- | వేసవి (DST) | not observed (UTC+0) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ci | |||||
కాలింగ్ కోడ్ | +225 | |||||
a Estimates for this country take into account the effects of excess mortality due to AIDS; this can result in lower population than would otherwise be expected. |
ఐరోపావాసుల వలసరాజనికి ముందు ఐవరీ కోస్టు అనేక దేశాలకు కేంద్రంగా ఉంది. వాటిలో గయామాను, కాంగు సామ్రాజ్యం, బావెలు ఉన్నాయి. ఈ ప్రాంతం 1843 లో ఫ్రాంసు రక్షితప్రాంతంగా మారింది. ఆఫ్రికా కొరకు ఐరోపాసమాఖ్య పెనుగులాటలో మధ్య ఈ ప్రాంతం 1893 లో ఫ్రెంచి కాలనీగా ఏకీకృతం చేయబడింది. 1960 లో ఫెలిక్సు హౌఫౌటు-బోయిగ్నీ (1993 వరకు దేశాన్ని పరిపాలించాడు) నేతృత్వంలో ఈ ప్రాంతం స్వాతంత్ర్యం సాధించింది. ప్రాంతీయ ప్రమాణాలు స్థిరంగా ఉన్నట్లు వర్గీకరించిన ఐవరీ కోస్టు పొరుగున ఉన్న పశ్చిమాఫ్రికా దేశాలతో, అలాగే పశ్చిమదేశాలతో (ప్రధానంగా ఫ్రాంసుతో) సన్నిహిత ఆర్థిక, రాజకీయ సంబంధాలు నెలకొల్పింది. ఐవరీ కోస్టు 1999 లో తిరుగుబాటును ఎదుర్కొన్నది. రెండు మత ఆధారిత పౌరయుద్ధాలను ఎదుర్కొన్నది. మొదటి పౌరయుద్ధం 2002-2007 లో జరిగింది.
[6] రెండవ పౌరయుద్ధం 2010-2011 మధ్యకాలంలో జరిగింది. 2000 లో కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించింది.[7]
ఐవరీ కోస్టు దాని అధ్యక్షుడికి విశేషమైన బలమైన కార్యనిర్వాహక అధికారం కలిగిస్తుంది. కాఫీ, కోకో ఉత్పత్తి ద్వారా 1960 - 1970 లలో పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఐవరీ కోస్టు ఒక ఆర్థిక శక్తిగా ఉంది. అయితే ఇది 1980 లలో ఆర్థిక సంక్షోభం కారణంగా రాజకీయ, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. 21 వ శతాబ్దంలో ఐవరీ కోస్టు ఆర్థిక వ్యవస్థ అధికంగా మార్కెట్టు ఆధారితంగా ఉంటుంది. ఐవరీ కోస్టు ఆర్థికవ్యవస్థ ఇప్పటికీ అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడుతుంది. చిన్నచిన్న రైతులు పండించే నగదు-పంట ఉత్పత్తి ఆధిక్యతలో ఉంది.[2]
అధికారిక భాష ఫ్రెంచి. స్థానిక భాషలు కూడా విస్తారంగా వాడుకలో ఉన్నాయి, వీటిలో బౌలె, డియులా, డాను, ఏమిను, సేబరా సేనుఫో ప్రధాన్యత వహిస్తున్నాయి. ఐవరీ కోస్టులో మొత్తం 78 భాషలు ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవులు (ప్రధానంగా రోమన్ కాథలిక్కులు), అనేక స్థానిక మతాలు ఆచరించబడుతూ ఉన్నాయి.
ఐవరీ కోస్టులో మానవ ఉనికి గుర్తించడం కష్టం. ఎందుకంటే దేశం తేమతో కూడిన వాతావరణం కారణంగా మానవ అవశేషాలు సంరక్షించబడలేదు. అయినప్పటికీ ఎగువ పాలోలిథికు కాలానికి చెందిన (క్రీ.పూ.15,000 నుండి 10,000) ఆయుధాలు, ఉపకరణాలు, (ప్రత్యేకంగా, వంటపాత్రలు, చేపల గాలాల అవశేషాలు, కత్తిరించిన పాలిషు చేయబడిన గొడ్డలి)ఈ ప్రాంతంలో పెద్దసంఖ్యలో పాలియోలిథికు లేదా నియోలిథికు మానవులు నివసించారనడానికి సాక్ష్యంగా ఉన్నాయి.[8][9]
ఐవరీ కోస్టు మొట్టమొదటి నివాసితుల అవశేషాలు ఈభూభాగం మొత్తం చెల్లాచెదురుగా కనిపించాయి. 16 వ శతాబ్దానికి పూర్వం దక్షిణంవైపు వలస వచ్చిన ప్రస్తుత స్థానిక నివాసుల పూర్వీకులు వీరిని స్థానభ్రంశం చేయడం లేదా వారిలో విలీనం చేయడం జరిగి ఉండవచ్చు అని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అలాంటి సమూహాలలో ఎహోటిలీ (అబోయిసో), కోత్రోవ్ (ఫ్రెస్కో), జెహిరి (గ్రాండ్ లాహౌ), ఎగా, డీసు (దివి) ఉన్నాయి.[10]
మొట్టమొదటి రికార్డు చరిత్ర [ఎప్పుడు?] ఉత్తర ఆఫ్రికా (బెర్బెరు) వర్తకులకు చెందినది [ఎక్కడ?] ప్రారంభంలో రోమను కాలం నుండి ఉప్పు, బానిసలు, బంగారం, ఇతర వస్తువులతో సహారాలో ఒక వాహన వాణిజ్యాన్ని నిర్వహించింది. ట్రాన్సు- సహారా వర్తక మార్గాలలోని దక్షిణ మార్గాలు ఎడారి అంచున ముగుస్తాయి. అక్కడ నుండి అనుబంధ వాణిజ్యం వర్షారణ్యం సరిహద్దుగా దక్షిణంగా విస్తరించింది. మరింత ముఖ్యమైన టెర్మినల్సుగా - జెన్, గవో, టిమ్బుక్టులను మహాసుడాను సామ్రాజ్యాలు ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెసాయి.
వారి శక్తివంతమైన సైనిక దళాలతో వాణిజ్య మార్గాల్ని నియంత్రించడం ద్వారా ఈ సామ్రాజ్యాలు పొరుగు దేశాలమీద ఆధిపత్యం చేయగలిగాయి. సుడానియ సామ్రాజ్యాలు కూడా ఇస్లామికు విద్యా కేంద్రాలు అయ్యాయి. నార్తు ఆఫ్రికా నుండి ముస్లిం బెర్బెరు వ్యాపారులు పశ్చిమ సూడానులో ఇస్లాంను పరిచయం చేసారు. అనేక ముఖ్యమైన పాలకుల మార్పిడి తర్వాత ఇస్లాం వేగంగా విస్తరించింది. 11 వ శతాబ్దం నుండి సూడానియ సామ్రాజ్య పాలకులు ఇస్లాం స్వీకరించిన సమయంలో సమకాలీన ఐవరీ కోస్టు ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు ఇస్లాం వ్యాపించింది
4 వ శతాబ్దం నుండి 13 వ శతాబ్దాల మధ్యకాలంలో మౌరిటానియ, దక్షిణ మాలి పర్వతాలను చుట్టుకొని ఉన్న ప్రాంతాలలో సుడాను సామ్రాజ్యం, మొట్టమొదటి ఘనా సామ్రాజ్యం వృద్ధి చెందాయి. 11 వ శతాబ్దంలో అవి శిఖరాగ్రానికి చేరుకున్న సమయంలో దాని భూభాగాలు అట్లాంటికు మహాసముద్రం నుండి టింబక్టు వరకు విస్తరించాయి. ఘనా తిరోగమనం తరువాత, మాలి సామ్రాజ్యం ఒక శక్తివంతమైన ముస్లిం సామ్రాజ్యంగా అభివృద్ధి చెందాయి. ఇది 14 వ శతాబ్ద ప్రారంభంలో దాని శిఖరాగ్ర స్థాయికి చేరింది. ఐవరీ తీరంలోని మాలి సామ్రాజ్యం భూభాగం ఓడియనే వాయువ్య భాగంలో పరిమితం చేయబడింది.
14 వ శతాబ్దం చివరిలో అంతర్గత అసమ్మతి, సామంతరాజులు ఎదురుతిరిరగడం కారణంగా నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. సామాంత దేశాలలో ఒకటి అయిన సంఘై 14 వ, 16 వ శతాబ్దాల మధ్య సామ్రాజ్యంగా వృద్ధి చెందింది. అంతర్గత అసమ్మతి జాతి కలహాలుగా వృద్ధిచెందిన కారణంగా సంఘై సామ్రాజ్యం బలహీన పడింది. ఈ వివాదం దక్షిణం ప్రాంతంలోని అటవీ ప్రాంతాల వైపుకు వలసలను విస్తరించింది. దేశంలోని దక్షిణ భాగంలో కప్పబడిన దట్టమైన వర్షపు అరణ్యం, ఉత్తరాన పెరిగిన భారీ స్థాయి రాజకీయ సంస్థలకు అడ్డంకులు సృష్టించాయి. నివాసులు గ్రామాలలో లేదా గ్రామాల సమూహాలలో నివసించారు. బయటి ప్రపంచంతో వారి పరిచయాలు దూరప్రాంతాలకు చెందిన వ్యాపారుల ద్వారా వడకట్టబడ్డాయి. గ్రామస్థులు వ్యవసాయం, వేట ఆధారితంగా జీవనం సాగించారు.
ఐరోపా ప్రారంభ కాలంలో ఐవరీ కోస్టులో ఐదు ముఖ్యమైన రాజ్యాలు వృద్ధి చెందాయి. 18 వ శతాబ్దం ప్రారంభంలో మాలి సామ్రాజ్యం క్రింద ఇస్లామీకరణను విడిచిపెట్టిన సెనౌఫో ప్రజలు నివసించిన ఉత్తర మధ్య ప్రాంతంలో జూలా ముల్లా కాంగు సామ్రాజ్యం స్థాపించాడు. కాంగు వ్యవసాయం, వాణిజ్యం, కళలు, జాతి వైవిధ్యం, వైవిధ్యమైన మతాల సంపన్న కేంద్రంగా ఉన్నప్పటికీ క్రమంగా రాజ్యం బలహీనపడింది. 1895 లో కాంగు నగరం మీద సమోరి టూర్ దాడి చేసి చేత జయించాడు. తరువాత ఇది వాసౌలోయు సామ్రాజ్యంలో భాగం అయింది.
17 వ శతాబ్దంలో అకాన్ సమూహం " అబ్రోన్ కింగ్డం ఆఫ్ గయామాన్ " పేరుతో అబ్రోన్ సామ్రాజ్యం స్థాపించబడింది. అభివృద్ధి చెందుతున్న అసంటేమన్ సమాఖ్య నుండి పారిపోయిన ప్రజలే అకాన్ సమూహం. ప్రస్తు ఘనా ప్రాంతమే అసంటేమన్. బొండుకోకు దక్షిణాన స్థిరనివాసం నుండి అబ్రోన్ క్రమంగా వారి ఆధిపత్యాన్ని బండౌకోలోని డ్యూల ప్రజల వరకు విస్తరించారు. డ్యూల ప్రజలు ఇటీవల బెఘో మార్కెట్టు నగరం నుండి వచ్చారు. బొండుకో వాణిజ్యం, ఇస్లాం మతానికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. రాజ్యం ఖురానిక్ పండితులు పశ్చిమ ఆఫ్రికాలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులను ఆకర్షించారు. 17 వ శతాబ్దం మధ్యకాలంలో తూర్పు-మధ్య ఐవరీ కోస్టులో అకాంటే నుండి పారిపోయిన ఇతర అకాన్ ప్రజలు సాకాస్సోలో బాయెలే రాజ్యం స్థాపించారు. అలాగే రెండు అగ్ని రాజ్యాలు (ఇండెనీ, సాన్విని) స్థాపించారు.
అసంటే లాగా బాలే కూడా పాలకులుగా రాజకీయ, పరిపాలనా వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది చివరికి చిన్న సంస్థానాలుగా విభజించబడింది. వారి సామ్రాజ్యం విచ్ఛిన్నమయినప్పటికీ బాయెలు ఫ్రెంచి అణిచివేతను తీవ్రంగా అడ్డుకుంది. ఐవరీ కోస్టు స్వాతంత్ర్యం తరువాత కొద్దికాలం పాటు వారి ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోవటానికి అగ్ని రాజ్యపాలకుల వారసులు ప్రయత్నించారు. 1969 నాటికి సాన్వి ఐవరీ కోస్టు నుండి వైదొలగడానికి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరుచడానికి ప్రయత్నించారు.[11] శాన్వి ప్రస్తుత రాజు నానా అమోన్ ఐదవ డౌఫౌ (2002 నుండి).
బానిసత్వం, బానిస దాడి అనుభవిస్తున్నప్పటికీ ఐవరీ కోస్టు పొరుగున ఉన్న ఘనాతో పోలిస్తే ఐవరీ కోస్టు బానిస వాణిజ్యంతో తక్కువగా బాధపడింది. ఐరోపా బానిస, వ్యాపార నౌకలు తీరంలోని ఇతర ప్రాంతాలను ఇష్టపడ్డారు. 1482 లో పోర్చుగీసు వారు మొట్టమొదటిసారిగా పశ్చిమాఫ్రికా దేశాల సముద్రతీరానికి చేరడంతో పశ్చిమాఫ్రికాలో మొట్టమొదటి ఐరోపా అన్వేషణ ప్రారంభం అయింది. 17 వ శతాబ్దం మధ్యలో సెయింట్ లూయిసు సెనగలులో మొట్టమొదటి పశ్చిమ ఆఫ్రికన్ ఫ్రెంచి స్థావరాన్ని స్థాపించపడు. అదే సమయంలో డచి వారు ఫ్రెంచికి డాకరు లోని గోరీ ద్వీపం హక్కును ఫ్రెంచికి వదిలారు. 1637 లో అస్సినిలోని గోల్డు కోస్టు (ఇప్పుడు ఘనా) సరిహద్దు వద్ద ఒక ఫ్రెంచి మిషను స్థాపించబడింది. ఈ సమయంలో స్థానికంగా బానిసత్వ ఆచరణను అణిచివేసారు. అలాగే వారి వ్యాపారులకు బానిసలను అందజేయడాన్ని నిషేధించారు.
అయితే అస్సినీ మనుగడ ప్రమాదకరంగా ఉంది. 19 వ శతాబ్దం మధ్యకాలం వరకు ఐవరీ కోస్టులో ఫ్రెంచి స్థిరమైన పాలన స్థాపించలేదు. 1843-4లో ఫ్రెంచి అడ్మిరలు లూయిసు ఎడౌర్డు బోయెటు-విలౌమెజు గ్రాండు బస్సం, అస్సినీ ప్రాంతాల రాజులతో ఒప్పందాల మీద సంతకం చేసి వారి భూభాగాలను ఒక ఫ్రెంచి సంరక్షక భూభాగంగా చేసారు. ఫ్రెంచి అన్వేషకులు, మిషనరీలు, వాణిజ్య కంపెనీలు, సైనికులు క్రమంగా ఫ్రెంచి ప్రాంతాన్ని లోగాను ప్రాంతం నుండి స్వదేశీ ప్రాంతాల పరిధిలో విస్తరించారు. 1915 వరకు పసిఫికేషను సాధించబడలేదు.
ఐరోపా ఆసక్తి తీరం నుండి లోపలి భూభాగంలోకి (ప్రత్యేకంగా సెనెగల్, నైజర్ల మధ్య రెండు గొప్ప నదులు ప్రవాహిత ప్రాంతాలలో) విస్తరించింది. 19 వ శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ ఆఫ్రికా ఫ్రెంచి అన్వేషణ ప్రారంభమైంది. కానీ ఇది ప్రభుత్వ విధానానికంటే వ్యక్తిగత చొరవపై ఆధారపడుతూ నిదానంగా జరిగింది. 1840 వ దశకంలో ఫ్రెంచి స్థానిక పశ్చిమ ఆఫ్రికా నాయకులతో పలు వరుస ఒప్పందాలను కుదుర్చుకుంది. ఫ్రెంచి వారు గినియా గల్ఫు వెంట బలవర్థకమైన పోస్టులను నిర్మించి వాటిని శాశ్వత వ్యాపార కేంద్రాలుగా చేయడానికి వీలు కల్పించారు.
ఐవరీ కోస్టులో మొదటి పోస్టులుగా అసినిలో ఒకటి, గ్రాండు బస్సంలో (ఇది కాలనీ మొదటి రాజధానిగా మారింది) మరొకటి స్థాపించబడింది. పోస్టుల లోపల ఫ్రెంచి సార్వభౌమాధికారం కొరకు స్థానిక నాయకులతో ఒప్పందాలు జరిగాయి. ఫ్రెంచి పోస్టులలో విశేషవాణిజ్యాధికారం పొంది బదులుగా స్థానిక నాయకులకు వార్షికంగా రుసుము చెల్లించింది.
చెల్లించటానికి బదులుగా వ్యాపార అధికారములు కొరకు. ఈ ఒప్పందం పూర్తిగా ఫ్రెంచ్కు సంతృప్తికరంగా లేదు, ఎందుకంటే ట్రేడ్ పరిమితం చేయబడింది, ఒప్పంద బాధ్యతలపై అపార్థాలు తరచుగా తలెత్తాయి. ఒప్పంద షరతులలో తరచుగా సంభవించిన అపార్ధాలు, పరిమితమైన వాణిజ్యం కారణంగా అసంతృప్తి ఉన్నప్పటికీ వాణిజ్యాన్ని విస్తరించాలన్న ఆశతో ఫ్రెంచి ప్రభుత్వం ఈ ఒప్పందాలను కొనసాగించింది.
బ్రిటిషు వారితో సమానంగా గినియా గల్ఫు తీరంలో తమప్రభావం పెరగడానికి కూడా ఈ ప్రాంతంలోని ఉనికిని నిర్వహించాలని ఫ్రాన్సు కోరుకుంది. ఫ్రెంచి నావికా స్థావరాలను ఫ్రెంచి-వాణిజ్య వ్యాపారులను ఉంచటానికి, వారి స్థావరాలపై దాడులను అడ్డుకోవడానికి అంతర్గత క్రమబద్ధమైన పసిఫికేషన్ను ప్రారంభించటానికి ఫ్రెంచి నౌకాదళ స్థావరాలను నిర్మించింది. 1890 లలో గాంబియాతో (అధికంగా మండిన్కా గిరిజనులకు వ్యతిరేకంగా) సుదీర్ఘ యుద్ధానంతరం వారు దీనిని సాధించారు. అయినప్పటికీ 1917 వరకు బౌలె, ఇతర తూర్పు తెగలు దాడులు కొనసాగాయి.[ఆధారం చూపాలి]
1871 లో ఫ్రాంకో-పర్షియా యుద్ధంలో ఫ్రాన్సు ఓటమి తరువాత ఫ్రెంచి భూభాగాలైన అల్సాస్-లోరైనులను జర్మనీ విలీనం చేసుకుంది. ఫ్రెంచి ప్రభుత్వం దాని వలసవాద లక్ష్యాలను విడిచిపెట్టి పశ్చిమ ఆఫ్రికా ట్రేడింగు పోస్టుల నుండి సైనిక దళాలను ఉపసంహరించుకుంది. వాణిజ్య పోస్టులను స్థానికంగా నివసిస్తున్న వ్యాపారుల సంరక్షణకు వదిలింది. ఐవరీ కోస్టు లోని గ్రాండు బస్సం వద్ద ఉన్న వాణిజ్య కోస్టు మార్సెయిలు, ఆర్థరు వెర్డియరు సంరక్షణలో మిగిలిపోయింది. 1878 లో ఐవరీ కోస్టు ఎస్టాబ్లిష్మెంటు స్థావరానికి ఆయన పేరు పెట్టారు.[11]
1886 లో సమర్థవంతమైన ఆక్రమణ వాదనతో ఫ్రాన్సు దాని పశ్చిమ ఆఫ్రికా తీరప్రాంత వాణిజ్య పోస్టుల ప్రత్యక్ష నియంత్రణను సాధించింది. అంతర్గత భాగంలో వేగవంతమైన అంవేషణ కార్యక్రమం ప్రారంభించింది. 1887 లో లెఫ్టినెంటు లూయిసు గుస్తావే బింగరు ఐవరీ కోస్ట్ అంతర్గత భాగాలకు రెండు సంవత్సరాల ప్రయాణాన్ని సాగించాడు. ప్రయాణం ముగింపులో ఆయన ఐవరీ కోస్టులో ఫ్రెంచి సంరక్షక సంస్థలను స్థాపించడానికి నాలుగు ఒప్పందాలను ముగించాడు. అంతేకాక 1887 లో వెర్డియరు ప్రతినిధి మార్సెలు ట్రెయిచు-లాప్లిను, ఐర్లాండు కోస్టులో నైజరు నది ముఖద్వారంలో ప్రధాన జలాల నుండి ఫ్రెంచి ప్రభావాన్ని విస్తరించే ఐదు అదనపు ఒప్పందాల చర్చలు జరిపాడు.
1880 ల చివరినాటికి ఫ్రాన్సు ఐవరీ కోస్టు తీర ప్రాంతాలపై నియంత్రణను ప్రారంభించింది. 1889 లో బ్రిటను ఆ ప్రాంతంలో ఫ్రెంచి సార్వభౌమత్వాన్ని గుర్తించింది. అదే సంవత్సరం ఫ్రాన్సు ట్రెచు-లాప్లేను తమ భూభాగానికి గవర్నరుగా నియమించింది. 1893 లో ఐవరీ కోస్టు ఫ్రెంచి కాలనీగా మారింది. కెప్టెను బింగరు గవర్నరుగా నియమించబడ్డాడు. 1892 లో లైబీరియాతో, 1893 లో బ్రిటనుతో ఒప్పందాలు కాలనీ తూర్పు, పశ్చిమ సరిహద్దులను నిర్ణయించాయి. ఫ్రెంచి ప్రభుత్వం ఆర్థిక, పరిపాలనా ప్రయోజనాల కొరకు ఎగువ వోల్టా (ప్రస్తుత బుర్కినా ఫాసో) భాగాలను, ఫ్రెంచి సూడాను (ప్రస్తుత మాలి) ఐవరీ కోస్టులో కలపడం కొరకు 1947 వరకు ఉత్తర సరిహద్దు స్థిరపడలేదు.
ఫ్రాన్సు ప్రధాన లక్ష్యం ఎగుమతుల ఉత్పత్తిని ప్రేరేపించడం. కోఫీ, కోకో, పామాయిలు పంటలు వేగంగా తీరప్రాంతాల వెంట అభివృద్ధి చేయబడ్డాయి. ఐవరీ కోస్టు స్థిరనివాసులను అధిక సంఖ్యను కలిగి ఉన్న ఏకైక పశ్చిమ ఆఫ్రికా దేశంగా నిలిచింది. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో మిగిలిన ప్రాంతాలలో ఫ్రెంచి, బ్రిటీషు పెట్టుబడిదారులుగా ఉన్నారు. దీని ఫలితంగా ఫ్రెంచి పౌరులు కోకో, కాఫీ, అరటి తోటల యజమానులు చెందినవారు స్థానిక నిర్బంధ-కార్మిక వ్యవస్థను స్వీకరించారు.
ఫ్రెంచి పాలన ప్రారంభ సంవత్సరాలలో అంతర్గతంగా కొత్త పోస్టులను స్థాపించడానికి ఫ్రెంచి సైనిక దళాలు పంపబడ్డాయి. స్థానిక జనాభా, మాజీ బానిస-యజమానుల వర్గానికి చెందిన ప్రజలు కొంతమంది ఫ్రెంచి సెటిలర్లను ప్రతిఘటించారు. 1880 - 1890 లలో సొమోరీ టురె తన పొరుగువారిని జయించి బానిసత్వాన్ని తిరిగి స్థాపించి వస్సౌలౌ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ప్రస్తుతం ఉన్న గినియా, మాలి, బుర్కినా ఫాసో, ఐవరీ కోస్టు భూభాగాలు వస్సౌలౌ సామ్రాజ్యంలో భాగం అయ్యాయి. వస్సౌలౌ సామ్రాజ్యాన్ని స్థాపించిన సామోరి టరె ఫ్రెంచి సెటిలర్లను తీవ్రంగా ప్రతిఘటించారు. స్వంత తుపాకీలను తయారుచేసి, మరమ్మత్తు చేయగల సామర్ధ్యం కలిగి పెద్ద సంఖ్యలో బాగా సన్నద్ధమైన సమోరీ టురె సైన్యం స్థానిక నాయకులను ఆకర్షించింది. ఫ్రెంచి సమోరి టురె విస్తరణకు ప్రతిస్పందనగా సైనిక ఒత్తిడి ప్రయోగించి విజయం సాధించింది. 1898 లో ఆయన పట్టుబడి ఆయన సామ్రాజ్యం రద్దు చేయబడే వరకు 1890 ల మధ్యలో సాధారణ గిరిజన పోరాటాల కంటే సామోరీ టురె నుండి ఫ్రెంచి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుకొన్నది.
కాలనీ ప్రభుత్వ కార్యక్రమానికి మద్దతుగా ఫ్రాంసు 1900 లో తల పన్ను విధించడం ఊహించని నిరసనలను రేకెత్తడానికి కారణం అయింది. అనేక ఇవోయిరియన్లు ఈ పన్నును సంరక్షితప్రాంతా ఒప్పందాల ఉల్లంఘనగా భావించారు.. చాలామంది (ముఖ్యంగా లోపలి భాగంలో) ఈ పన్నుల సమర్పణ అవమానకరమైన చిహ్నంగానూ అణిచివేతగానూ పరిగణించబడింది.[12] 1905 లో ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికాలో బానిసత్వాన్ని అధికారికంగా రద్దు చేసింది.[13] 1904 నుండి 1958 వరకు ఐవరీ కోస్టు ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా సమాఖ్యలో భాగంగా ఉంది. ఇది థర్డు రిపబ్లికులో ఒక కాలనీ, ఓవర్సీసు భూభాగంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్సులో పోరాడటానికి ఫ్రాన్సు ఐవరీ కోస్టు నుండి రెజిమెంట్లను నిర్వహించింది. 1917-1919 మద్య కాలంలో కాలనీ వనరులు యుద్ధం కొరకు వెచ్చించబడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఐవరీ కోస్టులో 1,50,000 మంది పురుషులు మరణించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కాలం వరకు ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా ప్రభుత్వ వ్యవహారాలు ప్యారిసు నుంచి నిర్వహించబడ్డాయి. పశ్చిమ ఆఫ్రికాలో ఫ్రాన్సు విధానం "అసోసియేషన్" తత్వశాస్త్రంలో ప్రధానంగా ప్రతిబింబిస్తుంది, దీనర్ధం ఐవరీ కోస్ట్లోని అన్ని ఆఫ్రికన్లు అధికారికంగా ఫ్రెంచి వారిగా భావించబడతారు. కానీ వీరికి ఆఫ్రికా లేదా ఫ్రాంసులో ప్రాతినిధ్య హక్కులు ఉండవు.
ఫ్రెంచి వలసరాజ్య విధానం సమైక్యత, సంఘీభావనలను అధికరింపజేసింది. ఫ్రెంచి సంస్కృతి ఆధిపత్యంతో ఆచరణాత్మకమైన సమష్టి విధానంలో ఫ్రెంచి భాష, సంస్థలు, చట్టాలు, కాలనీల ఆచారాల విస్తరణను సూచిస్తుంది. కాలనీలలో ఫ్రెంచి ఆధిపత్యం అసోసియేషను విధానాన్ని పునరుద్ఘాటించింది. అయితే అది వలసరాజ్యాలకు, వలసరాజ్యాల వివిధ సంస్థలకు, చట్టవ్యవస్థల రూపకల్పనకు దారితీసింది. ఈ విధానం ప్రకారం ఐవరీ కోస్టులోని ఆఫ్రికన్లు తమ సొంత ఆచారాలను సంరక్షించడానికి అనుమతించబడ్డారు, దాంతో వారు బానిస వాణిజ్యం ఇటీవలి రద్దు వంటి ఫ్రెంచి ఆసక్తులకు అనుగుణంగా ఉన్నారు.
ఫ్రెంచ్ పరిపాలనలో శిక్షణ పొందిన స్థానిక ప్రముఖులు ఫ్రెంచి, ఆఫ్రికన్ల మధ్య మధ్యవర్తిత్వ సమూహంగా ఏర్పడ్డారు. 1930 తర్వాత కొంతమంది పాశ్చాత్య ఇవోయిరియన్లు ఫ్రెంచి పౌరసత్వం కొరకు దరఖాస్తు హక్కును పొందారు. చాలామంది ఇవోయిరియన్లు ఫ్రెంచి పౌరులుగా వర్గీకరించబడి అసోసియేషను విధానంలో పాలించబడ్డారు.[14] ఫ్రాన్సు పౌరులుగా, పైన చెప్పబడిన స్థానిక నాగరికతకు వెలుపల ఉన్న స్థానిక ప్రజలకు రాజకీయ హక్కులు లేవు. వారు గనుల పని, తోటలలో పోర్టర్లుగా వారి పన్ను బాధ్యతలో భాగంగా పబ్లికు ప్రాజెక్టులలో పనిచేయటానికి ముసాయిదా చేశారు. వారు సైన్యంలో సేవ చేయాలని భావించారు.[15]
రెండవ ప్రపంచ యుద్ధంలో 1942 వరకు విచి పాలన నియంత్రణలోనే ఉన్నాయి. తరువాత బ్రిటిషు సైనికదళం దాడి చేసిన సమయంలో తగినంత ప్రతిఘటన లేకుండా బ్రిటుషు ఆధీనంలోకి మారింది. విన్స్టన్ చర్చిలు జనరలు చార్లెసు డి గల్లె తాత్కాలిక ప్రభుత్వ సభ్యులకు తిరిగి అధికారం ఇచ్చాడు. 1943 నాటికి మిత్రరాజ్యాలు ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికాకు తిరిగి వచ్చాయి. 1944 లో బ్రజ్సవిల్లె సమావేశం జరిగింది. 1946 లో ఫోర్తు రిపబ్లికు మొదటి రాజ్యాంగ సభ రూపొందించబడింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆఫ్రికా విధేయతకు ఫ్రాంసు కృతజ్ఞతగా 1946 లో ప్రభుత్వ సంస్కరణలను చేపట్టింది. ఫ్రెంచి పౌరసత్వం కలిగిన ఆఫ్రికన్లకు రాజకీయప్రాతినిధ్య హక్కు ఇచ్చింది. నిర్బంధ కార్మికుల వివిధ రూపాలు రద్దు చేయబడ్డాయి. 1944-1946 మధ్యకాలంలో ఫ్రాన్సు విచి పాలన, ఐవరీ కోస్టులో తాత్కాలిక ప్రభుత్వాల మధ్య అనేక జాతీయ సమావేశాలు, రాజ్యాంగ సమావేశాలు జరిగాయి. 1946 చివరి నాటికి ప్రభుత్వ సంస్కరణలు స్థాపించబడ్డాయి ఇది ఫ్రెంచి పౌరసత్వపు నియంత్రణలో ఉన్న ఆఫ్రికన్లు అందరికి ఫ్రెంచి పౌరసత్వాన్ని అందించింది.
1958 వరకు ప్యారిస్లో నియమించిన గవర్నర్లు ఐవరీ కోస్టు కాలనీని నిర్వహించారు. బ్రిటీషు వలసరాజ్య పాలనా యంత్రాంగాలు వేర్వేరుగా విభజించి పాలించు విధానాలను అమలు చేశాయి. విద్యావంతులైన ఉన్నతస్థులకు మాత్రమే సమానత్వ హోదా కలిగించింది. ఫ్రెంచి వారు ఫ్రెంచి వ్యతిరేక భావం నుండి దూరంగా ఉండటానికి ప్రభావవంతమైన సాధారణ ప్రజలకు ఉన్నత హోదా ఇచ్చి సంతృప్తి పరిచింది. అసోసియేషను అభ్యాసాలను గట్టిగా వ్యతిరేకించినప్పటికీ విద్యావంతులైన ఐవోయిరియన్లు తమ ఫ్రెంచి సహచరులతో సమానత్వం (ఫ్రాన్సు నుండి పూర్తి స్వాతంత్ర్యం ద్వారా కాకుండా సమ్మేళనం ద్వారా సమానత్వం) సాధించవచ్చని భావించారు. యుద్ధానంతర సంస్కరణల సంయోగ సిద్ధాంతం అమలు చేయబడిన తరువాత ఇవోయిరియా నాయకులు ఇవోయిరియన్ల మీద ఉన్న ఫ్రెంచి ఆధిపత్యం కూడా అసమానత అని భావించారు. వారిలో కొందరు వివక్ష, రాజకీయ అసమానత స్వాతంత్ర్యంతో మాత్రమే ముగుస్తుందని భావించారు. ఇతరులు గిరిజన సంస్కృతి, ఆధునికత మధ్య విభజన సమస్య కొనసాగుతుందని భావించారు.[16]
ఫెలిక్సు హౌఫౌటు-బయోగ్ని (బౌలే నాయకున్ కుమారుడు) ఐవరీ కోస్టు స్వాతంత్య్రపిత అయ్యాడు. 1944 లో ఆయన ఆఫ్రికా కోకో రైతులకు మొట్టమొదటి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించాడు. ఫ్రెంచి ప్లాంటేషను యజమానులకు వలసవాద విధానం అనుకూలమైనదిగా ఉండేది. యునైటెడు యూనియను సభ్యులు వారి సొంత క్షేత్రాల కోసం వలస కార్మికులను నియమించారు. హౌఫౌట్-బోయిగ్నీకి త్వరలో ప్రాముఖ్యత పెరిగింది. ఒక సంవత్సరంలో పారిసులో ఫ్రెంచి పార్లమెంటుకు ఎన్నుకోబడ్డాడు. ఒక సంవత్సరం తరువాత ఫ్రెంచి నిర్బంధ కార్మిక విధానాన్ని రద్దు చేసింది. హ్యూఫౌట్-బోయిగ్నీ ఫ్రెంచి ప్రభుత్వంతో బలమైన సంబంధాన్ని ఏర్పాటుచేసాడు. ఐవరీ కోస్టు ఈ సంబంధాల నుండి లాభం పొందుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేసాడు. ఇది అనేక సంవత్సరాలు కొనసాగింది. ఫ్రాన్సు అతనిని ఒక మంత్రిగా నియమించింది. మొట్టమొదటి సారిగా ఒక ఆఫ్రికా వ్యక్తిని ఐరోపా ప్రభుత్వానికి మంత్రిగా నియమించింది.
1956 ఓవర్సీస్ సంస్కరణ చట్టం (లోయి కేడర్) తో ఫ్రాంసుతో సంబంధాలలో ఒక మలుపు తిరిగింది. ఇది పారిసు నుండి ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికాలో ఎన్నుకోబడిన ప్రాదేశిక ప్రభుత్వాలకు అధికారం బదిలీ చేసి మిగిలిన ఓటింగు అసమానతలను తొలగించింది. 1958 లో ఐవరీ కోస్టు ఫ్రెంచి కమ్యూనిటీ స్వతంత్ర సభ్యదేశంగా మారింది.
స్వాతంత్య్రం (1960) పొందిన సమయంలో దేశం సులభంగా ఫ్రెంచి వెస్ట్ ఆఫ్రికా అత్యంత సంపన్నమైన దేశంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం ఎగుమతులలో 40% ఐవరీ కోస్టు భాగస్వామ్యం వహించింది. హౌఫౌట్-బోయిగ్నీ మొట్టమొదటి అధ్యక్షుడిగా మారిన తరువాత తన ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడానికి రైతులకు మంచి ధరలను అందించింది. ఇది పరిసర దేశాలలోని కార్మికుల గణనీయమైన వలసల కారణంగా మరింత పెరిగింది. కాఫీ ఉత్పత్తి గణనీయంగా పెరిగి బ్రెజిల్, కొలంబియా తరువాత ఐవరీ కోస్టు ప్రపంచ ఉత్పత్తిలో మూడో స్థానానికి చేరుకుంది. 1979 నాటికి దేశం కోకో ఉత్పత్తితో ప్రపంచంలోని ప్రముఖ ఉత్పత్తిదారుగా గుర్తించబడింది. ఇది ఆఫ్రికాలో అనాస, పామాయిలు ప్రముఖ ఎగుమతిదారుగా మారింది. ఫ్రెంచి సాంకేతిక నిపుణులు "ఇవోరియన్ అద్భుతం" సాధనకు సహకరించారు. ఇతర ఆఫ్రికా దేశాలలో ప్రజలు స్వాతంత్య్రం తరువాత ఐరోపావాసులను విడిచిపెట్టారు. కానీ ఐవరీ కోస్టులో వారు ప్రవాహంలా వచ్చి చేరారు. స్వతంత్రం పొందిన సమయంలో 30,000 మంది ఉన్న ఫ్రెంచి పౌరులు 1980 నాటికి 60,000కు ఫ్రెంచ్ కమ్యూనిటీ అభివృద్ధి చెందింది. వీరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు, సలహాదారులు ఉన్నారు.[17] [17] ] 20 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ దాదాపు 10% వార్షిక వృద్ధి రేటును కలిగి ఉంది. ఆఫ్రికా నాన్ ఆయిల్ -ఎగుమతి దేశాలలో అత్యున్నత స్థానంలో ఉంది.
హుఫౌటు-బోయిగ్నీ ఏక-పార్టీ పాలన రాజకీయ పోటీకి అనుకూలంగా లేదు. 2000 లో ఐవరీ కోస్టు అధ్యక్షుడైన లారెంటు గ్బాగ్బో, ఫ్రంటు పాపులారే ఐవోయిరియా పార్టీని స్థాపించిన కారణంగా హౌఫౌటు-బోయిగ్నీ ఆగ్రహానికిగురైన తరువాత 1980 లో దేశం విడిచి పారిపోవలసిన అగత్యం ఏర్పడింది.[18] హౌఫౌటు-బోగ్నియ ఆయనను ఎన్నుకోవటాన్ని కొనసాగించిన ప్రజలను నిరాటంకంగా పాలించాడు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంపై ఆయన దృష్టి పెట్టడం ఆయనను విమర్శకు గురిచేసింది.
అనేకమంది తన స్వంతగ్రామం అభివృద్ధి చేయడానికి మిలియన్లకొద్దీ డాలర్లను వ్యయంచేయడం, యమౌసౌక్రోను రాజధానిగా మార్చడానికి ప్రయత్నం చేసి కొత్త రాజకీయ రాజధానిని వృధా చేసాడని భావిస్తారు. ఇతరులు దేశంలోని కేంద్రస్థానంలో శాంతి, విద్య, మతం కొరకు ఒక కేంద్రాన్ని అభివృద్ధి చేయడం మీద దృష్టిపెట్టినందుకు మద్దతు ఇచ్చారు. 1980 ల ప్రారంభంలో ప్రపంచ మాంద్యం, స్థానిక కరువు ఐవోరియా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. కలప కొరకు చెట్లను అతిగా నరకడం, చక్కెర ధరల పతనం కారణంగా దేశం విదేశీ రుణభారం మూడు రెట్లు పెరిగింది. ఉద్యోగాల వేటలో గ్రామస్థులు ప్రవాహంగా అబిడ్జనలో ప్రవేశించిన కారణంగా నేరం నాటకీయంగా పెరిగిపోయింది.[19]
1990 లో వందల మంది పౌర సేవకులు సమ్మె చేశారు. సంస్థాగత అవినీతికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తూ విద్యార్థులు వీరితో చేరారు. ఈ ఆందోళన ప్రభుత్వం బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చేలా వత్తిడి చేసింది. హౌఫౌటు-బోగ్నియే చాలా బలహీనంగా మారి 1993 లో మరణించాడు. హెన్రీ కోనను బేడియే అతని వారసుడిగా రావాలని ఆయన కోరుకున్నాడు.
1995 అక్టోబరులో ప్రతిపక్షాలు విచ్ఛిన్నమై అపసవ్యంగా వ్యవహరించిన కారణంగా బెడియె తిరిగి ఎన్నికలో విజయం సాధించింది. ఆయన అనేక వందల ప్రతిపక్ష మద్దతుదారులను ఖైదుచేసి రాజకీయ జీవితంపై తన పట్టును కఠినతరం చేసాడు. దీనికి విరుద్ధంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ, విదేశీ అప్పులను తగీంచే ప్రయత్నం ఆర్థికాభివృద్ధిని పైమెరుగుగా మాత్రమే చేసింది.
హ్యూఫౌటు-బోగ్నియే జాతి ఘర్షణను నివారించడానికి, పరిసర దేశాల నుంచి వలస వచ్చిన వారికి పరిపాలనా స్థానాలకు దూరంగా ఉంచాడు. బేడియె అలా చేయకుండా ప్రత్యర్థి అలాసాను ఓయుటారాను బలహీనపరచడానికి ఐవోయిటియే పేరుతో ప్రాంతీయభావనను నొక్కి చెప్పాడు. భష్యత్తు అధ్యక్షపోటీకి సిద్ధం ఔతున్న అలాసాన్ ఓయుటారా తల్లితండ్రులిద్దరూ ఉత్తర ఐవోరియాకు చెందినవారు. ఐవోయిరియా జనాభాలో ఎక్కువ భాగం విదేశీప్రజలు ఉన్నారు. ఈ విధానం ఐవోరియన్ జాతీయత నుండి అనేకమందిని మినహాయించింది. వివిధ జాతుల మధ్య సంబంధాలు స్థానికతను దెబ్బతీసాయి. ఫలితంగా తరువాతి దశాబ్దాల్లో రెండు పౌర యుద్ధాలు ఏర్పడ్డాయి.
అదేవిధానం ఆధారంగా బేడియే సైన్యం నుండి అనేక మందిని మినహాయించారు. 1999 చివరలో అసంతృప్త అధికారుల బృందం ఒక సైనిక తిరుగుబాటును నిర్వహించి జనరలు రాబర్టు గుయీ అధికారంలోకి వచ్చింది. బేడియే దేశంవిడిచి ఫ్రాంసుకు పారిపోయాడు. కొత్త నాయకత్వం నేరాలను, అవినీతిని తగ్గించింది. జనరలు కొరకు " లెస్ వాస్టుఫుల్ సొసైటీ " వీధుల్లో ప్రచారం చేశారని,
2000 అక్టోబరులో లారెంటు గ్బగ్బో గ్యుయోతో పోటీ పడినప్పటికీ పోటీ శాంతియుతంగా జరగలేదు. సైనిక పౌర అశాంతి ఎన్నికలకు దారితీసినట్లు గుర్తించబడింది. ప్రజల తిరుగుబాటు కారణంగా సుమారుగా 180 మంది మరణించిన తరువాత గ్యుయోను పదవి నుండి తొలగించి గ్బగ్బో పదవిని చేపట్టాడు. అలస్సానె ఓటుటారా బుర్కినాబే జాతీయత కారణంగా సుప్రీం కోర్టు ఆయనను అనర్హుడిని చేసింది. అప్పటి రాజ్యాంగం తరువాత సంస్కరించబడినప్పటికీ అధ్యక్ష పదవి కొరకు పౌరులుకానివారు అధ్యక్షస్థానానికి పోటీచేయడానికి అనుమతించలేదు. దీంతో అలస్సానె ఓటుటారా మద్దతుదారులు (ప్రధానంగా దేశ ఉత్తర ప్రాంతం నుండి) రాజధాని యమస్సౌస్సౌక్రో అల్లర్లు చేసి పోలీసులతో పోరాడారు.
2002 సెప్టెంబరు 19 న ప్రారంభ గంటలలో అధ్యక్షుడు ఇటలీలో ఉన్నసమయంలో సాయుధ తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు బృందాలు అనేక నగరాలలో దాడులు ప్రారంభించారు. తిరుగుబాటుదారులు అబిడ్జానులోని ప్రధాన జెండర్మెరీ నివాసాల మీద దాడి చేసారు. యుద్ధం మధ్యాహ్నం వరకు కొనసాగింది. కానీ భోజన సమయంలో ప్రభుత్వ దళాలు అబిడ్జాను సురక్షితం చేసుకున్నాయి. అయినప్పటికీ వారు దేశంలోని ఉత్తర ప్రాంతాలమీద నియంత్రణను కోల్పోయారు. తిరుగుబాటు బలగాలు ఉత్తర నగరం బౌయాకె మీద బలమైన పట్టును సంపాదించాయి
తిరుగుబాటుదారులు మళ్లీ అబిడ్జానును కదిలిస్తామని బెదిరించారు. వారి పురోగతిని ఆపడానికి ఫ్రాన్సు దేశంలో తన స్థావరం నుండి దళాలను నియమించింది. ఫ్రెంచి వారు తమ సొంత పౌరులను ప్రమాదము నుండి రక్షించుకుంటారని చెప్పారు. కానీ వారి విస్తరణ కూడా ప్రభుత్వ దళాలకు సహాయపడింది. ఫ్రెంచి ఇరువైపులా సహాయం చేస్తుండటం వాస్తవం కాదు. కానీ రెండు వైపుల నుండి ఫ్రెంచి వ్యతిరేక పక్షానికి మద్దతునిచ్చింది. ఫ్రెంచి చర్యలు దీర్ఘకాలంలో పరిస్థితిని మెరుగుపర్చాయా లేదా అధ్వాన్నం చేశాయానా అనేది వివాదాస్పదంగా ఉంది. వాస్తవానికి ఆరోజు రాత్రి ఏమి జరిగింది అన్నది కూడా వివాదాస్పదమైంది. మాజీ అధ్యక్షుడు రాబర్టు గ్యుయె ఒక తిరుగుబాటు ప్రయత్నాన్ని నడిపించాడని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ టీవీ వీధిలో తన మృతదేహం చిత్రాలు చూపించింది. ప్రతిపక్ష వాదనలు ఆయన తన 15 మంది అనుచరులతో తన ఇంటిలో హత్య చేయబడ్డాడని పేర్కొన్నాయి. ఆయన శరీరం అంత్యక్రియలు జరిపించడానికి వీధులకు తరలించబడింది. అల్సాను ఓయుటారా జర్మనీ దౌత్య కార్యక్రమంలో శరణార్ధిగా వెళ్ళాడు. ఆయన ఇంటిని కాల్చివేశారు. అధ్యక్షుడు గ్బాగ్బో ఇటలీ తన పర్యటన ఆపిచేది తిరిగి దేశానికి చేరుకుని తన టెలివిజను ప్రకటనలో తిరుగుబాటుదారులు కొందరు షాంటీ పట్టణంలోని విదేశీ వలస కార్మికులు నివసిస్తున్న దాక్కున్నారని పేర్కొన్నారు. జెండెర్మెసు, విజిలెంట్స్ వేలాది మంది గృహాలను బుల్డోజర్లతో పడగొట్టి గృహాలను కాల్చివేసి నివాసితులు మీద దాడి చేశారు.
తిరుగుబాటుదారులతో ప్రారంభమైన కాల్పుల విరమణకు ఉత్తర జనాభాలో అధికభాగం మద్దతు ఇచ్చింది. స్వల్ప-కాలిక జరిగిన తిరుగుబాటు ప్రధాన కోకో-పెరుగుతున్న ప్రాంతాలు తిరిగి స్వాధీనం అయ్యాయి. కాల్పుల సరిహద్దులన నిర్వహించడానికి ఫ్రాంసు బలగాలను పంపింది. [20] లైబీరియా, సియెర్రా లియోనె నుండి యుద్ధవీరులు, యోధులు సంక్షోభం అవకాశం తీసుకుని పశ్చిమప్రాంత భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది.
2003 జనవరిలో గ్బగ్బో, తిరుగుబాటు నాయకులు ఒక "జాతీయ సంకీర్ణ ప్రభుత్వం"ను ఏర్పరుచుకున్నారు. కర్ఫ్యూలు ఎత్తివేయబడ్డాయి. ఫ్రెంచి దళాలు దేశ సరిహద్దును నియంత్రించాయి. సంకీర్ణ ప్రభుత్వం అస్థిరంగా ఉంది. కేంద్ర సమస్యలు లక్ష్యాలను సాధించలేకపోయాయి. 2004 మార్చిలో జరిగిన ప్రతిపక్ష ర్యాలీలో 120 మంది చనిపోయారు. తరువాతి ఆకస్మిక హింస కారణంగా విదేశీ పౌరులు తరలించడం జరిగింది. తదుపరి నివేదికలో హత్యలు ప్రణాళిక చేయబడ్డాయని తెలియజేయబడింది. ఐక్యరాజ్యసమితి శాంతిభద్రతాదళాలు ఒక "జోన్ ఆఫ్ కాన్ఫిడెన్సు" ను నిర్వహించడానికి నియమించబడ్డారు. గ్బాగ్బో ప్రతిపక్షాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
2004 నవంబరులో తిరుగుబాటుదారులు నిరాయుధీకరణను నిరాకరించడంతో శాంతి ఒప్పందం కూలిపోయిన తర్వాత తిరుగుబాటుదారులపై గ్బగ్బో వాయుమార్గ దాడులకు ఆదేశించాడు. 2004 నవంబరు 6 న ఫ్రెంచి సైనికులు బౌక్లో జరిపిన వాయు దాడులలో తొమ్మిది మంది మృతి చెందారు. ఐవోరియా ప్రభుత్వం అది పొరబాటు అని అన్నప్పటికీ ఫ్రెంచి అది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని పేర్కొన్నారు. ప్రతిస్పందనగా తిరుగుబాటుదారులు చాలా ఇవోయిరియా సైనిక విమానాలను (రెండు Su-25 విమానాలు, ఐదు హెలికాప్టర్లు) నాశనం చేసి, అబిడ్జానులోని ఫ్రెంచుకు వ్యతిరేకంగా హింసాత్మక ప్రతీకార అల్లర్లు జరిపారు.[21]
2005 అక్టోబరు 30 న అధ్యక్షుడిగా గ్బాగ్బో పదవీకాలం ముగిసింది. కాని నిరాయుధీకరణ జరగకపోవడంతో ఎన్నికలు అసాధ్యం అని భావించబడ్డాయి. కాబట్టి ఆఫీసులో అతని పదవీకాలం ఒక సంవత్సరం గరిష్ఠంగా పొడిగించబడింది. దీనిని ఆఫ్రికా సమాఖ్య, యునైటెడ్ నేషన్సు సెక్యూరిటీ కౌన్సిలు ఆమోదించింది.[22] 2006 అక్టోబరు చివరలో ఎన్నిక నిర్వహించాలని గడువు విధించబడింది. తిరుగుబాటుదారులు, ప్రతిపక్షాలు గ్బాగ్బోకు మరొక పదవీకాల విస్తరణను తిరస్కరించారు. [23] 2006 నవంబరు 1 న గ్బాగ్బో పదవీకాలం మరొక సంవత్సరం పొడిగింపును యు.ఎన్. భద్రతా మండలి ఆమోదించింది. ప్రధానమంత్రి చార్లెసు కోనను బన్నీ అధికారాలను బలపరిచేందుకు ఈ తీర్మానం అమోదించింది. మరుసటి రోజు తీర్మానం అంశాలు రాజ్యాంగ ఉల్లంఘనగా భావించబడవని పేర్కొన్నారు.[24]
2007 మార్చి 4 న ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య నూతన శాంతి ఒప్పందం మీద సంతకం చెయ్యబడింది. తదనంతరం న్యూ ఫోర్సెసు నాయకుడు అయిన గిలియం సోరో ప్రధానమంత్రి అయ్యాడు. ఈ సంఘటనలు గ్బాగ్బో స్థానాన్ని గణనీయంగా బలోపేతం చేశాయని కొంతమంది పరిశీలకులు భావించారు.[25]
యునెస్కో ఆధారంగా పౌర యుద్ధం ముగిసిన తరువాత నీరు, పారిశుధ్య మౌలిక సదుపాయాలు చాలా దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలు వారి నీటి సరఫరాకి మరమ్మతు అవసరమవుతాయని భావిమచారు.[26]
Alassane Ouattara President since 2010 |
Daniel Kablan Duncan Prime Minister from 2012 to 2017 |
2005 లో నిర్వహించాల్సిన అధ్యక్ష ఎన్నికలు 2010 నవంబరు వరకు వాయిదా వేయబడ్డాయి. ఓటారాకు ప్రధాన కార్యాలయం నుండి ఎన్నికల కమిషను అధ్యక్షుడు స్వతంత్రంగా ప్రకటించడం ఆ కమిషనులో మోసం గురించిన ఆందోళన కలిగించింది. [విడమరచి రాయాలి] మాజీ ప్రధాన మంత్రి అలసేను ఓయుటారాకు అనుకూలంగా, గ్బాగ్బోకు వ్యతిరేకంగా ఫలితాలు వెలువరించబడ్డాయి.[27]
నూతన తిరుగుబాటుదారుల బలగాల నియంత్రణలో ఉన్న ఉత్తర విభాగాలలో భారీ మోసం జరిగిందని రాజ్యాంగ మండలిక ముందు అధికార ఎఫ్.పి.ఐ. ఆరోపించింది. ఈ ఆరోపణలు ఐక్యరాజ్యసమితి పరిశీలనకు (ఆఫ్రికా యూనియన్ పరిశీలకులు కాకుండా) విరుద్ధంగా ఉన్నాయి. ఫలితాల నివేదిక తీవ్ర ఉద్రిక్తత, హింసాత్మక సంఘటనలకు దారితీసింది. గ్బాగ్బో మద్దతుదారులను కలిగి ఉన్న రాజ్యాంగ మండలి చట్టవిరుద్ధమైన ఏడు ఉత్తర విభాగాల ఫలితాలను ప్రకటించింది. ఎన్నికలలో గ్బాగ్బో 51% ఓట్లతో (ఎన్నికల కమిషను నివేదిక ఆధారంగా ఒయుటారాకు 54%) గెలిచాడు.[27] గ్బాగ్బో పదవీ స్వీకారం తరువాత అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి విజేతగా గుర్తించిన ఓయుటారా ప్రత్యామ్నాయ పదవీస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంఘటనలు పౌర యుద్ధంతీవ్రం ఔతుందన్న భయాలను అధికరించాయి. వేల సంఖ్యలో శరణార్ధులు దేశం విడిచి పారిపోయారు.[27]
ఆఫ్రికాసమాఖ్య ఈ ఘర్షణకు మధ్యవర్తిగా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు థాబో బెకీని పంపింది. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిలు అలసేను ఓయుటారాను విజేతగా గుర్తించిన తీర్మానాన్ని స్వీకరించింది. " ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికా స్టేట్సు " నిర్ణయాధికార దేశాల జాబితా నుండి ఐవరీకోస్టును తొలగించింది.[28] ఆఫ్రికా యూనియను కూడా దేశసభ్యత్వాన్ని తొలగించింది.[29]
2010 లో ఐవరీ కోస్టు సాయుధ దళాల కల్నలు న్యుగాసెను యావో న్యూయార్కులో అరెస్టయ్యాడు. ఏడాది పొడవునా యు.ఎస్. ఇమ్మిగ్రేషను అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్సుమెంటు ఆపరేషనులో ఆయుధాల అక్రమ రవాణా నేరాన్ని ఆరోపించింది: 4,000 9 మి.మీ చేతి గన్లు, 2,00,000 రౌండ్లు మందుగుండు, 50,000 కన్నీటి గ్యాసు గ్రెనేడ్లు రావాణా చేది యు.ఎన్. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు.[30] దౌత్య పాస్పోర్టులు ఉన్నందున అనేక ఐవరీ కోస్టు అధికారులు విడుదలయ్యారు. అతని సహచరుడు మైఖేలు బారీ షోరు, ఒక అంతర్జాతీయ వర్తకుడు. ఆయన వర్జీనియాలో ఉన్నాడు.[31][32]
2010 అధ్యక్ష ఎన్నికలు 2010-2011 ఇవోరియా సంక్షోభం రెండవ ఐవోరియా పౌర యుద్ధం దారితీసింది. అంతర్జాతీయ సంస్థలు రెండు వైపులా అనేక మానవ-హక్కుల ఉల్లంఘనలను జరిగాయని నివేదించాయి. డ్యూకోయు నగరంలో వందలాది మంది ప్రజలు చంపబడ్డారు. సమీపంలోని బ్లాలెక్వినులో డజన్ల కొద్దీ చంపబడ్డారు.[33] యు.ఎన్. దళాలు, ఫ్రెంచి దళాలు గ్బాగ్బోకు వ్యతిరేకంగా సైనిక చర్య తీసుకున్నాయి.[34]
2011 ఏప్రెలు 11 న ఆయన నివాసంమీద దాడిచేసి గ్బాగ్బోను అదుపులోకి తీసుకున్నారు. యుద్ధం తీవ్రంగా దెబ్బతిన్నది. పరిశీలకులు ఓయుటారాకు ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం, ఐవోరియన్లను తిరిగి కలిపడం సవాలుగా ఉంటాయని చెబుతారు.[35] 2017 జనవరిలో గ్బాగ్బోను " ఇంటర్నేషనలు క్రిమినలు కోర్టు " (హగ్యూ) కు తీసుకువెళ్లారు. కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించి షరతులతో 2019 జనవరిలో విడుదల చేసింది. [36][37] బెల్జియం హోస్టు దేశంగా నియమించబడింది.[38]
ఐవరీ కోస్టు పశ్చిమ ఉప-సహారా ఆఫ్రికా దేశం. ఇది పశ్చిమసరిహద్దులో లైబీరియా, గినియా, ఉత్తరసరిహద్దులో మాలి, బుర్కినా ఫాసో, తూర్పు సరిహద్దులో ఘానా, దక్షిణసరిహద్దులో గినియా (అట్లాంటిక్ మహాసముద్రం). దేశం 4 ° నుండి 11 ° ఉత్తర అక్షాంశం, 2 ° నుండి 9 ° పశ్చిమ రేఖాంశంలో ఉంటుంది. 64.8% వ్యవసాయ భూమి; సాగు భూమి 9.1%, శాశ్వత పచ్చిక బయలు 41.5%, శాశ్వత పంటలు 14.2%. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో నీటి కాలుష్యం ఒకటి.[39]
2011 నుండి ఐవరీ కోస్టు 12 జిల్లాలు, రెండు జిల్లా-స్థాయి స్వతంత్ర నగరాలుగా నిర్వహించబడుతోంది. జిల్లాలు 31 ప్రాంతాలుగా విభజించబడ్డాయి; ఈ ప్రాంతాలను 108 నిర్వాహక విభాగాలుగా విభజించారు. విభాగాలు 510 ఉప-నిర్వాహక విభాగాలుగా విభజించబడ్డాయి.[40] కొన్ని సందర్భాలలో గ్రామసమూహాలు కమ్యూన్లుగా విభజించబడ్డాయి. స్వతంత్ర జిల్లాలు విభజించబడవు. కానీ వాటిలో విభాగాలు, ఉప-అధికారులు, కమ్యూన్లను ఉంటాయి.
2011 నుండి 12 స్వయంప్రతిపత్తి రహిత జిల్లాలకు గవర్నర్లు నియమించబడలేదు. ఫలితంగా ఈ జిల్లాలు ఇంకా ప్రభుత్వ సంస్థలుగా పనిచేయడం ప్రారంభించలేదు.
The following is the list of districts, district capitals and each district's regions:
Map no. | జిల్లా | జిల్లా రాజధాని | ప్రాంతాలు | ప్రాంత కేద్రాలు | జనసంఖ్య [41] |
---|---|---|---|---|---|
1 | అబిద్జాను (District Autonome d'Abidjan) |
4,707,404 | |||
2 | బాస్ - సస్సంద్రా జిల్లా (District du Bas-Sassandra) |
శాన్- పెడ్రొ | గ్బొక్లె | సస్సంద్రా | 4,00,798 |
నవా | సౌబ్రె | 10,53,084 | |||
శాన్ - పెడ్రొ | శాన్- పెడ్రొ | 8,26,666 | |||
3 | కొమె (District du Comoé) |
అబెంగౌరౌ | ఇండెనీ- జుయాబ్లిను | అబెంగౌరౌ | 5,60,432 |
సుదు- కొమె | అబొయిస్సో | 6,42,620 | |||
4 | డెంగ్యూలె (District du Denguélé) |
ఒడియన్నె | ఫోలాను | మినిగ్నాను | 96,415 |
కబడౌగౌ | ఒడియన్నె | 1,93,364 | |||
5 | గోహు- జిబౌయ (District du Gôh-Djiboua) |
గగ్నొయ | గోహు | గగ్నొయా | 8,76,117 |
లోహు- జిబౌయా | డివొ | 7,29,169 | |||
6 | లాక్సు (District des Lacs) |
డింబొక్రొ | బెలియరు ప్రాంతం | యమౌస్సౌక్రొ [42] | 3,46,768 |
ఇఫ్ఫౌ | డౌక్రొ | 311,642 | |||
మొరొనౌ | బొంగౌయానౌ | 3,52,616 | |||
ఎన్.జీ N'Zi | డింబొక్రొ | 2,47,578 | |||
7 | లగూనెసు (District des Lagunes) |
డబౌ | అగ్నెబీ- టియస్సా | అగ్బొవిల్లె | 6,06,852 |
గ్రాండ్సు- పాంట్సు | [డబౌ | 3,56,495 | |||
లా- మె | అడ్జొపె | 5,14,700 | |||
8 | మొంటాగ్నెసు (District des Montagnes) |
మాను | కవల్లీ | గుయిగ్లొ | 4,59,964 |
గ్యూమెను | డ్యూకౌయె | 9,19,392 | |||
టాంక్పి | మాను | 9,92,564 | |||
9 | Sassandra-Marahoué (District du Sassandra-Marahoué) |
డలోల | హౌటు- సస్సంద్రా | డలోయా | 14,30,960 |
మరహౌయె | బౌయాఫ్లె | 8,62,344 | |||
10 | సవనెసు (District des Savanes) |
కొర్హొగొ | బగౌయె | బౌండియలి | 3,75,687 |
పొరొ Poro | [కొర్హొగొ | ,763,852 | |||
ట్చొలోగొ | ఫర్కెస్సెడౌగౌ | 4,67,958 | |||
11 | వల్లీ డూ బండమా (District de la Vallée du Bandama) |
బౌయాకె | గ్బెకె | బౌయాకె | 10,10,849 |
[హంబొలు | Katiola | 429,977 | |||
12 | వొరొబా (District du Woroba) |
సెగౌయెలా | బెరె | మంకొనొ | 3,89,758 |
బఫింగు | టౌబా | 1,83,047 | |||
వొరొడౌగౌ | సెగ్యుయెలా | 2,72,334 | |||
13 | యమౌస్సౌక్రొ (District Autonome du Yamoussoukro) |
3,55,573 | |||
14 | జంజాను (District du Zanzan) |
బొండౌకౌ | బౌంకనీ | బౌనా | 2,67,167 |
గొంటౌగొ | బొండౌకౌ | 6,67,185 | |||
ఐవరీ కోస్టు తలసరి ఆదాయం (2017 లో యు.ఎస్.$ 1,662). పొరుగు భూభాగంలో ఉన్న భూబంధిత దేశాలకు రవాణా వాణిజ్యంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. " వెస్టు ఆఫ్రికా ఎకనామికు అండ్ మానిటరీ యూనియను " అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. ద్రవ్య యూనియను మొత్తం జి.డి.పి.లో ఐవరీకోస్టు 40% నికి భాగస్వామ్యం వహిస్తుంది. దేశంలో కోకో బీన్సు అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. సబ్ సహారా ఆఫ్రికాలో (సాధారణంగా దక్షిణాఫ్రికా, నైజీరియా, అంగోలా తరువాత) వస్తువుల ఎగుమతిలో నాలుగో అతిపెద్ద ఎగుమతిదారు దేశంగా ఉంది.[43]
2009 లో కోకో-బీను రైతులు కోకో ఎగుమతుల కోసం 2.53 బిలియను డాలర్లు సంపాదించారు. 2013 లో 6,30,000 మెట్రికు టన్నుల ఉత్పత్తి చేస్తారని అంచనా వేశారు.[44][45] హెర్షీ కంపెనీ ఆధారంగా కోకో బీన్సు ధర రాబోయే సంవత్సరాల్లో నాటకీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.[46] ఐవరీ కోస్టులో 1,00,000 రబ్బరు రైతులు ఉన్నారు. వీరు 2012 లో మొత్తం $ 105 మిలియన్లను సంపాదించారు.[47][48] 1960 లో స్వాతంత్ర్యం తరువాత ఫ్రాంసుతో సంబంధాలు మూసివేయడం, వ్యవసాయ ఎగుమతుల విస్తరణ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం ఐవరీ కోస్టు ఆర్థిక వృద్ధికి కారకాలుగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో, ఐవరీ కోస్టు దాని ప్రధాన వ్యవసాయ పంటలకు ప్రపంచ మార్కెట్లో ఎక్కువ పోటీ, ధరల పతనం సమస్యలను ఎదుర్కొంటున్నది: కాఫీ, కోకో. అధిక అంతర్గత అవినీతితో కలిపి విదేశీ మార్కెట్లలో ఎగుమతి చేసే రైతుల జీవితం కష్టతరం చేస్తుంది. కార్మిక శక్తి " యు.ఎస్. డిపార్టుమెంటు ఆఫ్ లేబరు " ఎడిషనులో దేశీయ కోకో, కాఫీ ఉత్పత్తిలో నిర్బంధ కార్మికులకు సంబంధించిన నివేదికలు వచ్చాయి. 2009 నుండి " బాలకార్మికులు, నిర్బంధకార్మికులతో తయారు చేయబడుతున్న వస్తువులు " గురించి ప్రస్తావన చోటుచేసుకుంటున్నది.[49]
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఐవరీ కోస్టు ఆర్థికవ్యవస్థ అనేక ఇతర ఆఫ్రికా దేశాల కంటే వేగంగా పెరిగింది. దీనికి ఒక కారణము ఎగుమతి వ్యవసాయంపై పన్నులు కావచ్చు. ఐవరీ కోస్టు, నైజీరియా, కెన్యా పెద్ద నగదు-పంట నిర్మాతలుగా ఉండటంతో కొత్తగా స్వతంత్ర దేశాల పాలకులు ఎగుమతి వ్యవసాయంపై పన్నులను విధించకుండా వదిలివేసాయి. ఫలితంగా వారి ఆర్థిక వ్యవస్థలు బాగా అభివృద్ధి చెందాయి.[50]
2016 లో యు.ఎస్.లో ఫార్చ్యూను మ్యాగజైనులో ప్రచురించబడిన ఈ సమస్యపై ఒక ప్రధాన అధ్యయనం సుమారు 2.1 మిలియన్ల మంది పిల్లలు ఇప్పటికీ కోకోను పెంపొందించే ప్రమాదకరమైన పనిన్చేస్తున్నారని నిర్ధారించారు. పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందో లేదో అనే విషయం సందేహాస్పదంగా ఉంది:
"కోకో బేరోమీటరు 2015 ఎడిషను ప్రకారం లాభరహిత సంస్థ కన్సార్టియం ప్రచురించిన కోకో ఆర్థిక శాస్త్రాన్ని పరిశీలిస్తున్న ఒక ద్వైవార్షిక నివేదిక ప్రకారం, 2013-14 పెరుగుతున్న సీజన్లో ఘనాలో సగటు రైతు కేవలం రోజుకు 84 ¢ ఉత్పత్తి చేయగా, ఐవరీలో రైతులు రోజుకు 50 ¢. గత ఏడాది కోకో ధర 13% పెరిగినప్పటికీ సరాసరి రోజువారీ $ 1.90 అమెరికన్ డాలర్ల ఆదాయంతో తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నారు.
ఆ సందర్భంలో బాల కార్మిక నిర్మూలనకు సవాలు తీవ్రతరంగా మారింది. కోకో సంఘాల పెట్టుబడులను అధికరింపజేయడానికి చాక్లెటు కంపెనీల నూతన ఒప్పందము చాలదని భావించారు. " మేము కేవలం 10% అవసరమైన పనిని చేస్తున్నాము. ఇతర 90% పొందడం సులభం కాదు. ఇది చాలా భారీ వ్యవహారం " అని కామెరూనులో కోకో తోటలు పెంచి కోకో ఉత్పత్తి చేస్తున్న దేశాల కూటమి మాజీ సెక్రెటరీ జనరలు అయిన సొనా ఎబాయి అన్నాడు: "ఇది ఒక భారీ సమస్య. 'బాల కార్మికులు పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే కాదు. ప్రభుత్వ, పౌర సమాజం, ప్రైవేటు రంగం బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. అక్కడ నిజంగా మీ నాయకత్వం అవసరం.[51]
1998 గణాంకాల ఆధారంగా దేశజనాభా 1,53,66,672.[52] 2009 లో 2,06,17,068 గా అంచనా వేయబడింది. [2] 2014 జూలైలో 2,39,19,000 గా అంచనా వేయబడింది.[53] 1975 లో ఐవరీ కోస్టు మొట్టమొదటి గణాంకాల ఆధారంగా జనసంఖ్య 6.7 మిలియన్లు.[54]
2012 ప్రభుత్వ సర్వే ప్రకారం గర్భధారణ రేటు సరాసరి ఒక మహిళకు 5 పిల్లలు. పట్టణ ప్రాంతాల్లో 3.7, గ్రామీణ ప్రాంతాల్లో 6.3. .[55]
ఫ్రెంచి అధికారిక భాషగా పాఠశాలల్లో బోధించబడుతుంది. దేశంలో " లిగువా ఫ్రాంకా " గా పనిచేస్తుంది. ఐవరీ కోస్టులో 70 భాషలు వాడుకలో ఉన్నాయి. డయాలా వాణిజ్య భాషగా వ్యవహరిస్తూ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఇది ముస్లిం జనాభా సాధారణంగా మాట్లాడే భాషగా ఉంది.
2009 లో ఐవరీ కోస్టులో సుమారు 7.5 మిలియన్ల మంది ప్రజలు పనిచేస్తున్నారు. 1999 నుండి అనేక ఆర్థిక సంక్షోభాల కారణంగా 2000 ప్రారంభంలో ప్రైవేటు రంగం ఉద్యోగావకాశాలను దెబ్బతీసాయి. అంతేకాకుండా ఈ సంక్షోభాల కారణంగా ఐవరీ కోస్టు పర్యాటక పరిశ్రమ రవాణా, బ్యాంకింగు కంపెనీలు మూసివేయడం, తరలించడం జరుగింది. ఐవరీ కోస్టు సమాజంలో ఉద్యోగ అవకాశాలు తగ్గినకారణంగా 2012 లో నిరుద్యోగం రేటు 9.4%కి పెరిగింది.[56]
నిరుద్యోగతను తగ్గించడానికి ప్రతిపాదించిన పరిష్కార మార్గాలలో చిన్న వర్తకంలో విభిన్న ఉద్యోగావకాశాలను కల్పించడం ఒకటి. ఈ విభాగం ప రైతులను, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించింది. ఇవోరియను ప్రభుత్వంచే స్థాపించబడిన స్వీయ ఉపాధి విధానం 1995 నుండి ఏడు సంవత్సరాలలో 142% పెరుగుదలతో చాలా బలమైన వృద్ధికి అనుమతించింది.[57] ఇలాంటి ప్రయత్నాలు నిరుద్యోగతను తగ్గించినప్పటికీ ఇది ఇప్పటికీ ఒక సామాజిక సమస్యగా మిగిలిపోయింది.
అకానుతో చేర్చి స్థానిక ప్రజలు 42.1%, వోల్టైక్యూ ప్రజలు (గురు) ప్రజలు 17.6%, ఉత్తర మండే ప్రజలు (16.5%), క్రౌ ప్రజలు (11%), దక్షిణ మండే ప్రజలు (10%), ఇతరులు (2.8%, 30,000 లెబనీయులు, 45,000 ఫ్రెంచి ప్రజలతో సహా జాతి సమూహాలుగా అకాను (42.1%), వోల్టాయికులు (గురు) (17.6%), 2004). జనాభాలో సుమారు 77% మంది ఐవోరియా ప్రజలు ఉన్నారని భావిస్తారు.
ఐవరీ కోస్టు అత్యంత విజయవంతమైన పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. జనాభాలో 20% మంది (3.4 మిలియన్లు) పొరుగున ఉన్న లైబీరియా, బుర్కినా ఫాసో, గినియా నుండి కార్మికులు దేశంలో ఉన్నారు.
ఆఫ్రికా సంతతికి చెందని ప్రజలు దాదాపు 4% ఉన్నారు. వీరిలో చాలామంది ఫ్రెంచి ప్రజలు,[58] లెబనీయులు,[59] వియత్నాం ప్రజలు, స్పానిషు పౌరులు, అలాగే యునైటెడు స్టేట్సు, కెనడా నుండి ప్రొటెస్టంటు మిషనరీలు. 2004 నవంబరులో సుమారు 10,000 మంది ఫ్రెంచి ప్రజలు, ఇతర విదేశీ పౌరులను ఐవరీ కోస్టు ప్రభుత్వానికి చెందిన యువత సైన్యాధ్యక్షుల దాడుల సమయంలో తొలగించారు.[60] ఫ్రెంచి జాతీయులు కాకుండా కాలనీల కాలంలో వచ్చిన ఫ్రెంచి వలసదారులకు, స్థానిక ప్రజలకు జన్మించిన వారసులు ఉన్నారు.
ఐవరీ కోస్టు మతపరంగా వైవిధ్యభరితమైన దేశం. దీనిలో మొత్తం జనాభాలో 42.9% మంది ఇస్లాం మతం (ఎక్కువగా సున్ని), క్రైస్తవ మతం అనుయాయులు (ఎక్కువగా కాథలికు, ఎవాంజెలికలు) జనాభాలో 33.9% మంది ఉన్నారు. అదనంగా 19.1% మంది ఐరోరియన్లు నాస్థికులమని పేర్కొన్నారు, సాంప్రదాయ ఆఫ్రికా మతాల అనుయాయులు 3.6% మంది ఉన్నారు.[63] 2009 లో యు.ఎస్. డిపార్టుమెంటు అఫ్ స్టేటు అంచనాల ప్రకారం క్రైస్తవులు, ముస్లింలు 35% నుండి 40% మంది ఉన్నారు. అయితే జనాభాలో 25% మంది సాంప్రదాయ (ఆదివాసీ) మతాలను అభ్యసించారు.[64]
ఐవరీ కోస్టు రాజధాని యమౌస్సౌక్రొ ప్రపంచంలో అతిపెద్ద చర్చి భవనం " బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ పీస్ ఆఫ్ యమౌస్సౌక్రొ ఉంది.
ఐవరీ కోస్టులో జుడాయిజం ప్రధాన మతం కానప్పటికీ దేశవ్యాప్తంగా యూదులను చెల్లాచెదురుగా చూడవచ్చు. [ఆధారం చూపాలి]. 20 వ శతాబ్దం చివరలో అతిపెద్ద యూదు ప్రజల వలసలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయేలుకు చెందిన యూదులు వారుంటున్న దేశాలను వదిలి ఇజ్రాయెలుకు వెళ్ళారు. వారిలో ఐవరీ కోస్టుకు చెందిన యూదులు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఐవరీ కోస్టులో యూదు జనాభా తిరిగి అభివృద్ధి చెందడం ప్రారంభమైంది.[ఆధారం చూపాలి]
2004 లో ఆయుఃప్రమాణం పురుషులు 41 సంవత్సరాలు మహిళలకు 47 సంవత్సరాలు.[65] శిశు మరణాల సంఖ్య 1000 లో 118 లో ఉంది.[65] 1,00,000 మందికి పన్నెండు వైద్యులు అందుబాటులో ఉన్నారు.[65] జనాభాలో నాలుగింట ఒక వంతు మంది అంతర్జాతీయ దారిద్య్ర రేఖకు దిగువకు దినసరి యు.ఎస్. $ 1.25 అమెరికన్ డాలర్లు కంటే తక్కువ ఆదాఉఅంతో నివసిస్తున్నారు.[66] మహిళల్లో సుమారు 36% మంది స్త్రీ ఖత్నా విస్ఫారణంతో బాధపడుతున్నారు.[67] 2010 అంచనాల ప్రకారం ప్రసవసమయంలో అత్యధింగా తల్లులు మరణిస్తున్న దేశాలలో ఐవరీ కోస్టు ప్రపంచంలో 27 వ స్థానంలో ఉంది.[68] 15-49 సంవత్సరాల్లో పెద్దవాళ్ళలో 3.20% వద్ద 2012 లో అంచనా వేయబడిన, ప్రపంచవ్యాప్తంగా HIV / AIDS రేటు 19 వ స్థానంలో ఉంది.[69]
జనాభాలో ముఖ్యంగా మహిళలలో నిరక్షరాస్యత అధికంగా ఉంది. 6 నుంచి 10 సంవత్సరాల మధ్య పిల్లలలో చాలా మంది పాఠశాలలో చేరలేదు.[70] సెకండరీ విద్యలో ఎక్కువమంది మగవారు ఉంటారు. ద్వితీయ విద్య ముగిసేసరికి విద్యార్ధులు బక్ కల్లోరేట్ పరీక్షకు హాజరౌతారు.
అబిడ్జాలోని " యునివర్సిటీ డి కోకోడీ ", బౌకెలో ఉన్న " యూనివర్సిటీ డి బౌకే " వంటి పలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 2012 లో 57,541 మంది విద్యార్థులు పోస్టు-సెకండరీ డిప్లొమా స్థాయిలో చేరారు. 23,008 మంది విద్యార్థులు బ్యాచిలరు, మాస్టర్సు డిగ్రీ పొందారు. 269 మంది పి.హెచ్.డి. విద్యను అభ్యసించారు. రాజకీయ సంక్షోభంలో చోటు చేసుకున్న కారణంగా 2009 - 2012 మధ్యకాలంలో 18-25 సంవత్సరాల విద్యార్థుల తృతీయ విద్యలో నమోదు 9.03% నుంచి 4.46 %కు క్షీణించింది.[71]
ఉన్నత విద్య & శాస్త్రీయ పరిశోధన మంత్రిత్వశాఖ ప్రకారం, ఐవరీ కోస్టు జి.ఇ.ఆర్.డి. కొరకు జి.డి.పి.లో 0.13% కేటాయించింది. తక్కువ పెట్టుబడితో, సరిపోని శాస్త్రీయ పరికరాలు, పరిశోధన సంస్థల విభజన, పరిశోధన ఫలితాలను దోపిడీ చేయడం వంటి ఇతర సమస్యల కారణంగా వైఫల్యం సంభవించింది.[71]
శాస్త్రీయ పరిశోధనకు అంకితమైన 2012-2015లో జాతీయ అభివృద్ధి ప్రణాళిక వాటా పరిమితంగా ఉంది. ఎక్కువ సంపద సృష్టి, సాంఘిక ఈక్విటీ (ప్రణాళిక కోసం మొత్తం బడ్జెట్లో 63.8%) విభాగంలో కేవలం 1.2% శాస్త్రీయ పరిశోధనకు కేటాయించబడింది. సాధారణ పరిశోధన థీమ్ కొరకు ఇరవై నాలుగు జాతీయ పరిశోధన కార్యక్రమాలు సమూహం (ప్రభుత్వ, ప్రైవేటు) పరిశోధన, శిక్షణా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ కార్యక్రమాలు 2012-2015 లో ఆరోగ్యం, ముడి పదార్థాలు, వ్యవసాయం, సంస్కృతి, పర్యావరణం, పరిపాలన, మైనింగు, శక్తి, సాంకేతికత రంగాలలో పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.[71]
ఐవరీ కోస్టులో ఉన్న స్థానిక సమూహాలు దాని స్వంత సంగీత శైలులను కలిగి ఉన్నాయి. వీటిలో చాలా వరకు బలమైన బృందగానం ప్రాధాన్యత సంతరించుకుంది. మాట్లాడే డ్రమ్సు కూడా సాధారణంగా ఉపయోగించ బడుతుంటాయి. ప్రత్యేకంగా ఇవి అపోలోలో, మరొక ఆఫ్రికన్ బాణి అయిన పాలిరిథంసు ఐవరీ కోస్ట్ అంతటా కనిపిస్తాయి. ప్రత్యేకంగా నైరుతీలో అధికంగా ఉంటాయి.
ఐవరీ కోస్టులో ప్రసిద్ధ సంగీత కళా ప్రక్రియలలో జూబ్లాజో, జుగ్లో, కూపే-డికలీ ప్రాబల్యత కలిగి ఉన్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కొంతమంది ఐవోరియా కళాకారులలో మేజికు సిస్టమె, ఆల్ఫా బ్లాన్డీ, మీవే, డోబెటు గ్నాహొరె, టికెను జాహు ఫకోలీ, క్రిస్టినా గోహు ఐవోరియా సంతతికి చెందినవారుగా ఉన్నారు.
ఇటీవల కాలంలో ఐవరీ కోస్టు పలు అతిపెద్ద ఆఫ్రికన్ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. అతిసమీప కాలంలో " ఆఫ్రికన్ బాస్కెట్బాలు చాంపియన్షిపు " క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. గతంలో 1984 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్సుకు దేశం ఆతిధ్యమిచ్చింది. దీనిలో ఐవరీ కోస్టు ఫుట్బాల్ జట్టు ఐదో స్థానంలో నిలిచింది. 1985 లో ఐవరీ కోస్టు బాస్కెటు బాలు జట్టు " 1985 ఆఫ్రికన్ బాస్కెట్బాల్ చాంపియన్షిపు " క్రీడలలో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
ఐవరీ కోస్టు 1984 సమ్మరు ఒలింపికు క్రీడలలో పురుషుల 400 మీటర్ల పోటీలో ఒక రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ క్రీడలలో అది "కోట్ డి ఐవోరీ"గా పోటీపడింది.
ఐవరీ కోస్టులో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ అసోసియేషను ఫుటు బాలు. జాతీయ ఫుట్బాలు జట్టు 2006 లో జర్మనీలో, 2010 లో దక్షిణాఫ్రికా లో, 2014 లో బ్రెజిలులో ప్రపంచ కపు ఫుటు బాలు క్రీడలలో మూడు సార్లు ఆడింది. మహిళల ఫుటు బాలు జట్టు కెనడాలో 2015 మహిళల ప్రపంచ కపులో ఆడారు. ఐవరీ కోస్టు గుర్తించదగిన ఫుటు బాలు ఆటగాళ్ళుగా డిడియరు ద్రోగ్బా, యాయా టూరే, క్లోటో టూర్, ఎరిక్ బైల్లీ, గెర్విన్హో, విల్ఫ్రైడు జహా ప్రాధాన్యత వహిస్తున్నారు. రగ్బీ యూనియను కూడా ప్రజాదరణ పొందింది. 1995 లో దక్షిణాఫ్రికాలో రగ్బీ ప్రపంచ కపులో ఆడటానికి జాతీయ రగ్బీ యూనియను జట్టు అర్హత సాధించింది. ఐవరీ కోస్టు కూడా రెండు ఆఫ్రికా కప్పులను (1992 లో ఒకటి, 2008 లో మరొకటి) గెలుచుకుంది.
2019 లో బ్రిటీషు అధిరోహకులు బృందం ఐవరీ కోస్టును సందర్శించి దేశంలో మొట్టమొదటి అధిరోహణ మార్గాన్ని ఏర్పాటు చేసింది..[72]
పశ్చిమ దేశాలలోని పొరుగు దేశాలతో పోలిస్తే ఐవరీ కోస్టు సాంప్రదాయ వంటకాలు ధాన్యాలు, దుంపలు మీద ఆధారపడతాయి. కాసావా, అరటిపండ్లు ఐవోరియా వంటలలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. మొక్కజొన్న బంతులను తయారుచేయటానికి ఐతియు అనే ఒక మొక్కజొన్న పేస్టు ఉపయోగిస్తారు. వేరుశెనగలు అనేక వంటలలో విస్తారంగా ఉపయోగిస్తారు. తురిమిన కర్రపెండెలం, కూరగాయల ఆధారితమైన కౌసుకౌసులతో చేసిన అట్టియెయికె అనే ప్రసిద్ధ వంటకం ఐవరీ కోస్టులో ప్రధాన సైడు డిషుగా ఉంది. పాం నూనెలో వేయించిన పండిన అరటిపండు, అల్సోకో, పక్వమైన అరటి, ఉడికించిన ఉల్లిపాయలు, మిరపతో కలిపి ఉడికించిన చేపలు లేదా ఉడికించిన గుడ్లతో అందించే " అల్లొకొ " సాధారణంగా అందుబాటులో వీధి ఆహారంగా ప్రసిద్ధి చెందింది. చికెన్ సాధారణంగా వినియోగించబడుతుంది. ఈ ప్రాంతంలో పలుచని, తక్కువ-కొవ్వు ద్రవ్యరాశి కారణంగా ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. సముద్రపు ఆహారాలలో ట్యూనా, సార్డినెసు, రొయ్యలు, బొనిటో (ఇది ట్యూనా మాదిరిగా ఉంటుంది) ప్రాధాన్యత వహిస్తున్నాయి . మాఫే ఒక వేరుశెనగ సాసులో మాంసంతో కూడిన సాధారణ వంటకం.[73]
వివిధ పదార్ధాలతో నిదానంగా-ఉడికించిన స్ట్యూ ఐవరీ కోస్టులో మరొక సాధారణ ఆహారంగా ప్రాధాన్యత వహిస్తుంది.[73] " కేడ్జినో " వంటకాన్ని చికెను, కూరగాయలతో స్వల్పంగా నీటిని చేర్చి లేక నీరు లేకుండా సీలు చేదిన కుండలో వండుతారు. ఇది చికెను, కూరగాయల రుచులు కలగలిసిన వంటకం.[73] ఇది ఒక కానరీ అని పిలువబడే మట్టికుండలో నెమ్మదిగా కాల్చడం లేదా ఓవెన్లో వండబడుతుంది.[73] బాంగా ఒక స్థానిక తాటి కల్లు.
ఐవోరియాలో మాక్విసు అని పిలవబడే చిన్న " ఓపెన్-ఎయిర్ రెస్టారెంటు " అనే ఒక ప్రత్యేకమైన ఆహారవిక్రయశాల ఉంది. మాక్విసులో సాధారణంగా కాల్చిన చికెను, ఉల్లిపాయలు, టమోటాలతో కప్పిన చేపలు, అట్టియికె, కెడ్జెనౌలతో వడ్డిస్తారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.