గాంధీ శాంతి బహుమతి
పురస్కారం / From Wikipedia, the free encyclopedia
గాంధీ శాంతి బహుమతి (ఆంగ్లం : The International Gandhi Peace Prize), మహాత్మా గాంధీ పేరుమీద భారత ప్రభుత్వం ప్రదానం చేసే బహుమతి.
Gandhi Peace Prize | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | International | |
మొదటి బహూకరణ | 1995 | |
మొత్తం బహూకరణలు | 12 | |
బహూకరించేవారు | Government of India | |
నగదు బహుమతి | ₹ 10 million | |
మొదటి గ్రహీత(లు) | Julius Nyerere | |
క్రితం గ్రహీత(లు) | Desmond Tutu |
- గమనిక : అమెరికా సంస్థ ప్రమోషన్ ఎండ్యూరింగ్ పీస్ చే ప్రదానం చేయు పురస్కారం గాంధీ శాంతి అవార్డు
మహాత్మా గాంధీకి ఒక శ్రద్ధాంజలిగా ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. మహాత్మా గాంధీ 125వ జయంతిని పునస్కరించుకుని, 1995లో భారత ప్రభుత్వం ఈ అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని ప్రవేశపెట్టింది. సంవత్సరానికోసారి, వ్యక్తులకు గాని, సంస్థలకు గాని, సామాజిక, ఆర్థిక, రాజకీయ, అహింసా మార్గంలో పనిచేసినవారికి ఈ బహుమతి ప్రదానం చేయబడుతుంది. మరీ ముఖ్యంగా గాంధీ సిద్ధాంతాలను అనుసరించినవారికి ఈ బహుమతి ప్రదానం చేయబడుతుంది. ఈ బహుమతి కింద, కోటి రూపాయలు, ఓ ప్రశంసాపత్రం ఓ జ్ఞాపిక అందజేయబడుతుంది. ఈ బహుమతి కొరకు ప్రదేశం, భాషా, లింగ, జాతి, వయోభేదాలంటూ లేవు.
ఈ బహుమతి న్యాయనిర్ణేతల బృందములో, భారత ప్రధానమంత్రి, లోక్సభలోని ప్రతిపక్షనాయకుడు, భారత ప్రధాన న్యామూర్తి, ఇతర ప్రముఖులు వుంటారు. ప్రతి సంవత్సరమునకు వీరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, బహుమతి గ్రహీత పేరును వెల్లడిస్తారు.
పది సంవత్సారాల కాలంలో తమ కార్యక్రమ లక్ష్యాలను సాధించినవారు ఈ బహుమతికి అర్హులు. ఎవరైనా ప్రతిపాదన చేయవచ్చును.