చార్లెస్ కొరియా
భారతీయ వాస్తుశిల్పి / From Wikipedia, the free encyclopedia
చార్లెస్ కొరియా (1 సెప్టెంబరు 1930 – 16 జూన్ 2015) భారతదేశపు అత్యుత్తమ ఆర్కిటెక్టు.ఆయన అపురూప కట్టడాల రూపశిల్పి, నగర, పట్టణ అభివృద్ధి ప్రణాళికలలో అనేక నూతన ఒరవడులను సృష్టించిన సృజనశీలిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన పట్టణాలలోని పేదప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ సాంప్రదాయ పద్ధతులను నిర్మాణాలలో ఉపయోగించేవారు.[1]
త్వరిత వాస్తవాలు Charles Correaచార్లెస్ కొరియా, జననం ...
మూసివేయి
తన విశిష్ట సేవలకు 1972లో పద్మశ్రీ, 2006లో పద్మ విభూషణ్, ఆగాఖాన్ అవార్డు లాంటి అత్యున్నత అవార్డులతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకొన్నారు.1984లో రాయల్ గోల్డుమెడల్ను అందుకున్నారు. జపాన్ ప్రీమియం ఇంపీరియల్, రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాయల్ గోల్డ్ మెడల్ పురస్కారంతో సత్కరించింది. చార్లెస్ను బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ సంస్థ భారత దేశపు గొప్ప ఆర్కిటెక్ట్ అంటూ కీర్తించింది.