డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం
From Wikipedia, the free encyclopedia
డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము (పూర్వం ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయముగా పిలవబడేది) ఆంధ్ర ప్రదేశ్లో 1982లో స్థాపించబడిన సార్వత్రిక విశ్వవిద్యాలయము. దూర విద్యావిధానాన్ని భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ సంస్థదే. చదువుకోవాలనే కోరిక వుండి, ఏవైనా కారణాలవల్ల కళాశాలకు వెళ్లలేనివారికి ఉన్నత విద్యావకాశాలను అందించటానికి ఈ విశ్వవిద్యాలయము ప్రారంభించబడింది. దీనికి 218 విద్యాకేంద్రాలు (23 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు, పిజి కేంద్రాలతో) ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాలలో చదువుకొనవచ్చు. కొన్ని కోర్సులు ఇంగ్లీషు మాధ్యమంలోనే ఉన్నాయి. కొన్ని విషయాలు ఉర్దూ మాధ్యమంలో చదువుకొనవచ్చు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |