తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్
From Wikipedia, the free encyclopedia
తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ అనగా ఒక ఫైవ్స్టార్ హోటల్, ఇది మహారాష్ట్ర లోని ముంబై లో కొలబా ప్రాంతంలో ఉన్నది. ఇది తాజ్ హోటల్స్, రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ల యొక్క భాగం, ఈ హోటల్స్ సమూహంలో ఈ హోటల్ను అత్యంత ప్రతిష్టాత్మకమైన సంపత్తిగా భావిస్తారు, ఇది 560 రూములను, 44 సూట్లను కలిగి ఉంది.
తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ | |
---|---|
సాధారణ సమాచారం | |
ప్రదేశం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
భౌగోళికాంశాలు | 18.922028°N 72.833358°E / 18.922028; 72.833358 |
ప్రారంభం | 16-12-1903 |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | తాజ్ మహల్ ప్యాలెస్ లో 7 అంతస్తులు, తాజ్ మహల్ టవర్ లో 22 అంతస్తులు |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | సిద్ధేష్ ఎస్, సీతారాం ఖండేరావ్ వైద్యా, డి.ఎన్.మీర్జా |
ఇతర విషయములు | |
గదుల సంఖ్య | 560 |
సూట్ల సంఖ్య | 44 |
రెస్టారెంట్ల సంఖ్య | 11 |
జాలగూడు | |
http://www.tajhotels.com/Luxury/Grand-Palaces-And-Iconic-Hotels/The-Taj-Mahal-Palace-Mumbai/Overview.html |
భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబయిలోని కొలాబా ప్రాంతంలో ఫైవ్ స్టార్ తాజ్ మహల్ ప్యాలేస్ ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు అతి సమీపంలో ఈ హోటల్ కనిపిస్తుంది. మొత్తం 1500 మంది సిబ్బంది తాజ్ మహల్ ప్యాలేస్ హోటల్లో పనిచేస్తున్నారు. చారిత్రకంగా, కళానైపుణ్యాల పరంగా హోటల్ సముదాయమంతా విభిన్నమైన నిర్మాణ నైపుణ్యంతో కనిపిస్తుంది.
భారతదేశంలోనే అత్యున్నత సేవలు అందించే హోటల్ గా దీనికి గుర్తింపు ఉంది. విదేశీ అతిథులు, వివిధ దేశాల అధ్యక్షులు, ప్రఖ్యాత పరిశ్రమల ఛైర్మన్లు, సినితారలు, వ్యాపార ప్రముఖులు ఈ హోటల్లోనే బస చేస్తుంటారు.[1]