![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1b/Montage_of_Telangana_State.jpg/640px-Montage_of_Telangana_State.jpg&w=640&q=50)
తెలంగాణ చరిత్ర
తెలంగాణ రాష్ట్ర చరిత్ర / From Wikipedia, the free encyclopedia
ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, చరిత్రలో శాతవాహన (230 BCE నుండి 220 CE వరకు), కాకతీయ (1083-1323), ముసునూరి నాయకుల (1326-1356), ఢిల్లీ సుల్తానేట్ బహమనీ సుల్తానేట్ (1347-1512), గోల్కొండ సుల్తానేట్ (1512-1687), అసఫ్ జాహీ రాజవంశం (1724-1950) మొదలైన రాజవంశీయుల పాలనలో ఉంది.[1]
తెలంగాణ | |
---|---|
![]() తెలంగాణ ప్రదేశాలు (పై నుండి): చార్మినారు, వరంగల్ కోట, హైదరాబాదు నగరం, నిజామాబాదు రైల్వే స్టేషను, కుంటాల జలపాతం,ఫలక్నుమా ప్యాలెస్ |
1724లో ముబారిజ్ ఖాన్ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు. నిజాం రాజులు తెలంగాణలో మొదటి రైల్వేలు, పోస్టల్, టెలిగ్రాఫ్ నెట్వర్క్లు, మొదటి విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
భారత స్వాతంత్ర్యం తరువాత, హైదరాబాదు రాఫ్ట్రం భారతదేశంలో కలవడానికి విలీన పత్రంపై నిజాంరాజు సంతకం చేయలేదు. 1948లో భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడంతో విలీనం కాక తప్పలేదు. 2014 జూన్ 2న, హైదరాబాద్ రాజధానిగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది.[2] హైదరాబాద్ నగరం పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది.[3]