ధర్మేంద్ర
చలనచిత్ర నటుడు / From Wikipedia, the free encyclopedia
ధర్మేంద్ర (జననం 8 డిసెంబరు 1935)[1] ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. బాలీవుడ్ లో ఎక్కువ చిత్రాలు చేశారు ధర్మేంద్ర. హిందీ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
త్వరిత వాస్తవాలు ధర్మేంద్ర, పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ ...
ధర్మేంద్ర | |
---|---|
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ | |
In office 13 మే 2005 – 16 మే 2009 | |
అంతకు ముందు వారు | రామేశ్వర్ లాల్ దూది |
తరువాత వారు | అర్జున్ రామ్ మేఘ్వాల్ |
నియోజకవర్గం | బికనీర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ధరమ్ సింగ్ డియోల్ (1935-12-08) 1935 డిసెంబరు 8 (వయసు 88) సహ్నేవాల్, పంజాబ్ ప్రావిన్స్ బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత పంజాబ్, ఇండియా) |
జాతీయత | బ్రిటీష్ ఇండియన్ (1935–1947) ఇండియన్ (1947–ప్రస్తుతం) |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి |
|
సంతానం | 6; (సన్నీ డియోల్, బాబీ డియోల్, ఇషా డియోల్ లతో సహా) |
కళాశాల | రామ్గర్హియా కళాశాల, ఫగ్వారా పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్ |
వృత్తి |
|
పురస్కారాలు | 2012లో పద్మ భూషణ్ |
సంతకం |
మూసివేయి
ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రను ఆయన అభిమానులు "యాక్షన్ కింగ్", "హీ-మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు. షోలే (1975) చిత్రాన్ని ఆయన కెరీర్ లో పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు.
రాజస్థాన్ లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు ఆయన. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.[2]