నంద వంశం
From Wikipedia, the free encyclopedia
నంద వంశం (The Nanda Empire) భారతదేశ చరిత్రలో మగధ సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 5వ, 4వ శతాబ్దాల మధ్య కాలంలో పాలించింది. నంద సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన పంజాబ్ వరకు, దక్షిణంగా వింధ్య పర్వతాల వరకు విస్తరించింది.[1] వీరిని చంద్రగుప్త మౌర్యుడు ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.చంద్రగుప్తా మౌర్య మహాపద్మనంద వారసుడే.
నంద సామ్రాజ్యం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
క్రీ.పూ. 424–క్రీ.పూ. 321 | |||||||||
The Nanda Empire at its greatest extent under Dhana Nanda circa 323 BC. | |||||||||
రాజధాని | పాటలీపుత్ర | ||||||||
సామాన్య భాషలు | సంస్కృతం | ||||||||
మతం | Jainism Hinduism Buddhism | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
సామ్రాట్ | |||||||||
చారిత్రిక కాలం | Antiquity | ||||||||
• స్థాపన | క్రీ.పూ. 424 | ||||||||
• పతనం | క్రీ.పూ. 321 | ||||||||
|
నంద రాజవంశం క్రీ.పూ 4 వ శతాబ్దంలో- (బహుశా) (క్రీ.పూ 5 వ శతాబ్దంలో భారత ఉపఖండంలోని ఉత్తర భాగాన్ని పాలించింది. తూర్పు భారతదేశంలోని మగధ ప్రాంతంలోని శిశునాగ రాజవంశాన్ని నందాలు పడగొట్టి తమ సామ్రాజ్యాన్ని విస్తరించి ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగాన్ని చేర్చారు. పురాతన మూలాలు నందా రాజుల పేర్లు, వారి పాలన కాలానికి సంబంధించిన వివరణలు చాలా భిన్నంగా ఉంటాయి. మహావంశంలో నమోదు చేయబడిన బౌద్ధ గ్రంథాలు ఆధారంగా కొన్ని సిద్ధాంతాలు వారు సి. క్రీ.పూ 345-322 వారి పాలన క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దం నాటిదని పేర్కొన్నాయి.
ఆధునిక చరిత్రకారులు సాధారణంగా గంగారిడై పాలకుడుగా భావిస్తుండగా ప్రాచీన గ్రీకో-రోమను గ్రంథాలు పేర్కొన్న ప్రసిని నందా రాజుగా భావిస్తున్నారు. క్రీ.పూ 327-325 మధ్య కాలంలో వాయవ్య భారతదేశం మీద దాడి చేసిన అలెగ్జాండరు ది గ్రేట్ చరిత్రకారులు ఈ రాజును సైనికపరంగా శక్తివంతమైన, సంపన్న పాలకుడిగా వర్ణించారు. ఈ రాజు మీద యుద్ధం జరిగే సందర్భంలో అలెగ్జాండరు సైనికులలో తిరుగుబాటుకు దారితీసింది. ఫలితంగా అలెగ్జాండరు ప్రసీ మీద యుద్ధం చేయకుండా భారతదేశం నుండి వెనక్కి వెళ్ళవలసి వచ్చింది.
నందాలు హర్యంక, శిశునాగా పూర్వీకుల తరువాత వారి సామ్రాజ్యాలు నిర్మించి మరింత కేంద్రీకృత పరిపాలనను స్థాపించారు. వారు గొప్ప సంపదను సంపాదించి ఘనత వహించినట్లు పురాతన వనరులు పేర్కొంటున్నాయి. ఇది బహుశా కొత్త కరెన్సీ రూపొందించి పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. పురాతన గ్రంథాలు నందాలు తక్కువ స్థాయి పుట్టుక, అధిక పన్ను విధించడం, వారి సాధారణ దుష్ప్రవర్తన కారణంగా వారు ప్రజలలో జనాదరణ పొందలేదని సూచిస్తున్నాయి. చివరి నందా రాజును మౌర్య సామ్రాజ్యం వ్యవస్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు, చంద్రగుప్తుడి గురువు చాణక్య పడగొట్టారు.