పంజాబ్
భారతీయ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
పంజాబ్ (ਪੰਜਾਬ) (Punjab) భారతదేశంలో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన జమ్ము- కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్, దక్షిణాన హర్యానా, నైరుతిలో రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ దేశపు పంజాబు రాష్ట్రము ఉంది.
త్వరిత వాస్తవాలు
పంజాబ్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
చండీగఢ్ - 30.73°N 76.78°E / 30.73; 76.78 |
పెద్ద నగరం | లూధియానా |
జనాభా (2000) - జనసాంద్రత |
24,289,296 (15వ స్థానం) - 482/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
50,362 చ.కి.మీ (19వ స్థానం) - 19 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[పంజాబ్ |గవర్నరు - [[పంజాబ్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1956-11-01 - V.P.సింగ్ - కెప్టెన్ అమరేంద్ర సింగ్ - ఒకే సభ (117) |
అధికార బాష (లు) | పంజాబీ |
పొడిపదం (ISO) | IN-PB |
పంజాబ్ రాజముద్ర |
మూసివేయి
'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది.