From Wikipedia, the free encyclopedia
భారతీయ రాష్ట్రమైన పంజాబ్ మొత్తం జనాభాలో క్రైస్తవులు 1.1 శాతంగా ఉన్నారు. పంజాబీ సిక్కుల మెజారిటీగా ఈ రాష్ట్రం ఏర్పడింది. పంజాబ్ ప్రాంతానికి 1834లో ప్రధానంగా మొదట క్రైస్తవాన్ని ప్రచారం చేసినవారు జాన్ లావ్రీ, విలియం రీడ్.[1] బ్రిటీష్ పరిపాలనలో హిందు, చురా, మఝబీ సిక్ఖు మతాల నుంచి క్రైస్తవంలోకి మారారు.[2]
1839 వేసవిలో మహారాజా రంజీత్ సింగ్ మరణించడంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడి, తర్వాతి వారసత్వ యుద్ధాల్లో దర్బారు రాజ్యాన్ని బలహీనం చేసింది. ఆ పరిణామాల అనంతరం రెండు ఆంగ్లో-సిక్ఖు యుద్ధాలు జరిగి చివరకు ఆంగ్లేయులకు పంజాబ్ ఆఖరున దత్తమైన రాజ్యంగా బ్రిటీష్ ఇండియాలో 1849లో కలిసిపోయింది.
1877లో సెయింట్ థామస్ దినోత్సవాన వెస్ట్ మినిస్టర్ అబ్బే, లండన్ లో రెవరెండ్ థామస్ వల్పై ఫ్రెంచ్ ఉమ్మడి పంజాబ్ రాష్ట్రానికి రాజధాని అయిన లాహోరులో తొలి ఆంగ్లికన్ బిషప్ ఆఫ్ లాహోరును నియమించి, దాని కింద అప్పటి బ్రిటీష్ వలస పాలనలోని మొత్తం పంజాబ్ లో క్రైస్తవ కార్యకలాపాలు బాధ్యత అప్పగించారు. ఇది 1887 వరకూ ఇలానే కొనసాగింది. [3][4][5] రెవరెండ్ థామస్ పాట్రిక్ హ్యూస్ చర్చి మిషనరీ సొసైటీ యొక్క మిషనరీగా పెషావర్ లో (1864–84) పనిచేసి, ప్రాచ్య పండితుడై డిక్షనరీ ఆఫ్ ఇస్లాం (1885) గ్రంథాన్ని సంకలనం చేశారు.[6]
మొత్తం పంజాబీ క్రైస్తవుల సంఖ్య భారత పంజాబ్ లో 3 లక్షలు. వీరిలో దాదాపుగా సగం మంది రోమన్ కేథెలిక్ లు కాగా, మిగతా సగం ప్రొటెస్టెంట్లు. పలువురు ఆధునిక పంజాబీ క్రైస్తవులు బ్రిటీష్ పరిపాలన కాలంలో మతం మారిన వారి వారసులే, వారిలో చురా వర్గం నుంచి క్రైస్తవం స్వీకరించినవారూ ఉన్నారు. చురాలు బ్రిటీష్ ఇండియా కాలంలో ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున క్రైస్తవంలోకి మారారు. మత విషయాల్లో ఉత్సాహవంతులైన బ్రిటీష్ సైనికాధికారులు, క్రైస్తవ మిషనరీలు మఝబీ సిక్ఖు సముదాయం కూడా హిందూ చురాలతో పాటుగా క్రైస్తవం స్వీకరించారు. భారత విభజన తర్వాత వీరు పాకిస్తానీ పంజాబ్, భారత పంజాబ్ ప్రాంతాలలో విభజింపబడ్డారు. ఇక్కడే కాక ఉత్తర ప్రదేశ్, రోహిలా ఖండ్ ప్రాంతాల్లోనూ మఝబీ సిక్ఖులు చాలా పెద్ద సంఖ్యలో క్రైస్తవంలోకి మారడంతో[7] సిక్ఖు సంస్థలు వేగంగా ప్రతిస్పందించి మత మార్పిడులు నిరోధించడానికి సిక్ఖు మిషనరీలను పంపారు.[8]
డయోసీస్ ఆఫ్ అమృత్ సర్ ఆఫ్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియాకు రోమన్ కేథలిక్ డయోసీస్ ఆఫ్ జలంధర్ లో ఒక స్థానం ఉంది. క్రైస్తవ సముదాయాలతో పలు ఆవాసాలు ఉన్నాయి.[9] 1881 నుంచి 1891 వరకూ క్రైస్తవ జనాభా అప్పటికి ఇంకా సంయుక్తంగానే ఉన్న పంజాబ్ లో విస్తారంగా పెరిగింది..[10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.