పద్మశ్రీ పురస్కారం
భారత ప్రభుత్వ పురస్కారం / From Wikipedia, the free encyclopedia
పద్మశ్రీ (ఆంగ్లం: Padma Shri) భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌరపురస్కారం.పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం భారతరత్న, రెండవది పద్మ విభూషణ్ మూడవది పద్మ భూషణ్, నాలుగవది పద్మశ్రీ. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ"లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు. ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం 2336 మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.[1]
త్వరిత వాస్తవాలు పురస్కారం గురించి ...
పద్మశ్రీ | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | పౌర | |
విభాగం | సాధారణ | |
వ్యవస్థాపిత | 1954 | |
మొదటి బహూకరణ | 1954 | |
క్రితం బహూకరణ | 2020 | |
మొత్తం బహూకరణలు | 3005 | |
బహూకరించేవారు | భారత ప్రభుత్వం | |
నగదు బహుమతి | ... | |
వివరణ | ... | |
రిబ్బను |
మూసివేయి