పుఠియా ఆలయం
From Wikipedia, the free encyclopedia
పుఠియా ఆలయ సముదాయం బంగ్లాదేశ్లోని రాజ్షాహి జిల్లా, పుఠియా ఉపజిల్లాలోని ప్రముఖ పురాతన హిందూ దేవాలయాల సమూహం. ఇది బంగ్లాదేశ్లో అత్యధిక సంఖ్యలో చారిత్రక దేవాలయాలను కలిగి ఉన్న ప్రదేశం. ఇది రాజ్షాహి నగరానికి తూర్పున 23 కిమీ దూరంలో ఉంది. రాజ్షాహికి చెందిన పుఠియా రాజ కుటుంబీకులు, హిందూ జమీందార్లు, రాజులు ఈ దేవాలయాలను నిర్మించారు. దేవాలయాలు వివిధ శైలులతో విలక్షణమైన నిర్మాణ శైలిని కలిగి ఉన్నాయి.[1][2]