బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ
From Wikipedia, the free encyclopedia
సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బ్రిటిషు భారతదేశంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క దిగువ సభ. మోంటాగు-చెమ్స్ఫోర్డ్ సంస్కరణలను అమలు చేస్తూ భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా దీన్ని ఏర్పాటు చేసారు. దీనిని ఇండియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కూడా పిలుస్తారు. ఎగువ సభ పేరు కౌన్సిల్ ఆఫ్ స్టేట్. భారత స్వాతంత్ర్యం తరువాత, 1947 ఆగస్టు 14 న శాసనసభ రద్దైంది. దాని స్థానంలో భారత రాజ్యాంగ సభ ఏర్పడింది.
త్వరిత వాస్తవాలు కేంద్ర శాసనసభ, రకం ...
మూసివేయి