భారతదేశపు బ్రిటిష్ సామ్రాజ్య అస్తమయం
భారతదేశంలో బ్రిటిషవారిపాలన అంతమైన సమయం / From Wikipedia, the free encyclopedia
16వ శతాబ్దమునుండి అనేక దేశములలో బ్రిటిష్ వలస రాజ్యములు స్థాపింపబడి బ్రిటిష్ సామ్రాజ్యము విస్తరింపబడిన చరిత్రాంశములు చాల చిత్రమైనవి. ఈ భుగోళముపై 19వ శతాబ్దమునాటికి యున్న బ్రిటిష్ వలసరాజ్యములు దిశదిశలా యుండుటవలన “ బ్రిటిష్ సామ్రాజ్యములో సూర్యడస్తమించడు” (Sun never sets on British Empire) అనేటటువంటి అతిశయోక్తి బ్రిటిష్ సామ్రాజ్యము విస్తరించియున్న స్థితిని తెలుపుతున్నది. బ్రిటిష్ సామ్రాజ్యము స్థాపించిన రీతి, స్థాపించుటకు ఉద్దేశము, ప్రేరణ హేతువులు అనేకము గానుండి కాలానుగుణ అబిమతములు కలిగిన సార్వభౌమత్వమైనందున చరిత్రలోని అనేక సామ్రాజ్యములు స్థాపింబడిన రీతిగా బ్రిటిష్ సామ్రాజ్యము స్థాపింపబడలేదనిపించక తప్పదు. ఇంగ్లండు దేశములోని బ్రిటిష్ ప్రభుత్వమువారు సరాసరి ఇతర దేశములపై సైనికచర్యచేసి రాజ్యాక్రమణచేయలేదు. చరిత్రలో అప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిగ వ్యక్తిగత సంస్థలు అనేక దేశములకు వలస పోయి అచ్చట రాజ్యస్థాపనచేయుటవలన బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు దోహదమైనవి. అనాదిగా బ్రిటిష్ ప్రజలు అనేక దేశములకు వాణిజ్యముకోసము వ్యక్తిగతముగను, సంస్థలుగ వలసపోయిరి. భూగోళములో ఏ ఖండములో ఎక్కడనున్నను తమ బ్రిటిష్ ప్రజానీకమునకు రక్షణకల్పుటయే సూత్రమని ఇంగ్లండు లోని రాజు గారి పేరట పరిపాలించు బ్రిటిష్ ప్రభుత్వము తమ జాతీయప్రజారక్షణ పేరట రక్షక దళములు నియమించిరి. అనేక దేశములకు వలసపోయిన బ్రిటిష్ వ్యక్తిగత సంస్థలు రాజ్యములు స్ధాపించి ఇంగ్లండు లోని వారి జాతీయప్రభుత్వమునకు లోబడి వలసరాజ్యములలో రాజ్యాధికారము చెలాయించి క్రమేణ పరిపాలనా యంత్రాంగములను ఇంగ్లండు లోని బ్రిటిష్ ప్రభుత్వపరముచేయుటవలన బ్రిటిష్ సామ్రాజ్యము విస్తరించింది. ఇతరదేశములలో జరిగినటులనే భారతదేశములో కూడా వారి వాణిజ్యసంస్థ చే స్ధాపించబడ్డ వలసరాజ్యమును ఇంగ్లండు లోని బ్రిటిష్ ప్రభుత్వమువారు క్రమక్రమముగా నియంత్రణలోకి తీసుకునుటవలన భారతదేశములో క్రి.శ 1600 సంవత్సరములో వాణిజ్యసంస్థగా వచ్చిన బ్రిటిష్ వారు ఒక శతాబ్దము తరువాత 1707లో ఔరంగజేబు మరణించి మొగలాయి సార్వభౌమత్వము తిరస్కరించబడుచున్న కొలదికాలమునకే రాజ్యతంత్రములు, కుంతంత్రములతో వంగరాష్ట్రములో మొట్టమొదటగా 1765 లో బ్రిటిష్ వలస రాజ్యస్థాపన చేసి తదుపరి రాజ్యాధికారములు చేపట్టిరి (చూడు: రాబర్టు క్లైవు- వారన్ హేస్టింగ్సుల రాజ్యతంత్రములు ). కాలక్రమేణ బ్రిటిష్ సంస్థవారి రాజ్యధికారము యావద్భారతదేశానికి విస్తరింపజేసిరి. వాణిజ్య సంస్తవారు చెలాయించిన రాజ్యాధికారమును 1858 లో ఇంగ్లండు లోని వారి జాతీయ ప్రభుత్వపరముచేసిరి. వాణిజ్యసంస్థ వారి ఇంగ్లండులోనుండిన నిర్దేశకులు తమసంస్తల అభివృధ్దికి రాజ్యాధికారము, రాజస్వము అవసరమని చెప్పిన సంగతులు చరిత్రలోకి వచ్చినతరువాత బ్రిటిష్ రాజ్యము భారతదేశములో అప్రయత్నముగా స్థాపించిరన్నది సరికాదని తెలిసింది. బ్రిటిష్ సామ్రాజ్యములోని బానిసరాజ్యములలోకల్ల అత్యంత విలువైనదని గుర్తింపుపొందినది భారతదేశము (చూడు:లార్డ్ కర్జన్ ) దాదాపు రెండు వందల సంవత్సరములు బానిసరాజ్యముగనేలిన భారతదేశానికి పూర్తి స్వతంత్రత పరిపాలననివ్వక అనేక సంస్కరణల పేరట విభజించి పరిపాలించమన్న సూత్రముతో కొద్దికొద్దిగా ప్రజాపరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టి ఉపశమన కార్యక్రమమలుచేసిరే గాని పూర్తిగా స్వరాజ్యమిచ్చుటకిష్టపడలేదు. అటువంటి వైఖరిలో 20వశతాబ్దముదాకా నడపిన శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యము 1945 లోఅకస్మాత్తుగా భారతదేశమును విడచిపెట్టుటకు నిశ్చయించిన చరిత్రాంశములు తెలుసుకోదగ్గవి, చాల విశేషమైనవి. అప్పటినుండియె బ్రిటిష్ సామ్రాజ్యము అస్తమించుట ప్రారంభమైనదని చరిత్రకారులు నిర్ధారించిరి. భారతదేశమునకు స్వతంత్రమిచ్చుటవలన కలిగిన మహత్తర పర్యవసానము ‘సామ్రాజ్యము’ అను శబ్దమును వారు వ్వవహారికమునుండి మాటుచేసి కామన్ వెల్త్ (Common Wealth) అను వ్యవహారికనామము విస్తరింపచేసిరి.[1][2].
జనాభా | సుమారు 1.8 billion |
---|---|
నివసించేవారు | South Asian Desi (local; traditional) |
దేశాలు | |
ఆధారపడేవారు | British Indian Ocean Territory |
పెద్ద నగరాలు |