భారతదేశ సరిహద్దులు
From Wikipedia, the free encyclopedia
భారతదేశానికి చైనా, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దులున్నాయి. [1] బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటితో భూ సరిహద్దులతో పాటు సముద్ర సరిహద్దులు కూడా ఉన్నాయి. శ్రీలంకతో రామసేతు ద్వారా సముద్ర సరిహద్దు మాత్రమే ఉంది. అండమాన్ నికోబార్ దీవుల ద్వారా థాయిలాండ్, మయన్మార్, ఇండోనేషియాలతో భారతదేశానికి సముద్ర సరిహద్దులు ఉన్నాయి.