భారత జాతీయగీతం
From Wikipedia, the free encyclopedia
జనగణమన, భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది.
English: "Thou Art the Ruler of the Minds of All People" | |
---|---|
భారత జాతీయగీతం | |
National anthem of భారతదేశం | |
Lyrics | Gurudev Rabindranath Tagore[1], 1911[2][3][4][5] |
Music | Gurudev Rabindranath Tagore[1], 1911[2][4][3][5] |
Adopted | 24 January 1950 |
Audio sample | |
"Jana Gana Mana" (Instrumental)
| |
1911 డిసెంబరు 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు.
1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది.
1912 లో ఈ పాటను ఠాగూర్ మేనకోడలు సరళా దేవి చౌధురాని పాఠశాల విద్యార్థుల బృందంతో పాటు భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు బిషన్ నారాయణ్ ధర్, అంబికా చరణ్ మజుందార్ వంటి ప్రముఖ కాంగ్రెస్ సభ్యుల ముందు ప్రదర్శించారు.[6]
1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.
ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి "మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా" అనే పేరుతో తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను పోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.