భారత జాతీయ మానవ హక్కుల కమిషన్
From Wikipedia, the free encyclopedia
భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993లో భారత పార్లమెంటు మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 1993 అక్టోబరు 12న ఏర్పడింది. ఈ కమిషన్ రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా ప్రజలకు కల్పించిన హక్కుల రక్షణ బాధ్యతలు చేపడుతుంది.[1]
త్వరిత వాస్తవాలు Agency overview, Jurisdictional structure ...
జాతీయ మానవ హక్కుల కమిషన్ | |
భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ లోగో | |
నినాదం | సర్వే భవంతు సుఖినా |
అందరు సంతోషంగా ఉండాలి | |
Agency overview | |
---|---|
Formed | 12 అక్టోబర్ 1993 |
Legal personality | Governmental: Government agency |
Jurisdictional structure | |
Federal agency | [[ భారతదేశం]] |
General nature |
|
Operational structure | |
Headquarters | సర్దార్ పటేల్ భవన్, న్యూఢిల్లీ, భారతదేశం |
Agency executive | అరుణ్ కుమార్ మిశ్రా, చైర్పర్సన్ |
Website | |
అధికారిక వెబ్సైటు | |
మూసివేయి
దేశంలోని ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా బతికే హక్కు ఉందని, అతని హక్కులకు భంగం కలిగించినా, అన్యాయంగా ఎన్ కౌంటర్ ల పేరిట చంపినా ప్రశ్నించేందుకు రాజ్యాంగం జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. తప్పు చేసిన ఏ వ్యక్తినైనా చట్టపరంగానే శిక్షించాలి కానీ చట్టాన్ని తీసుకుని ఏ విధమైన చర్యలు పాల్పడరాదు. అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారిస్తుంది.