భారత ప్రభుత్వ చట్టం - 1935
From Wikipedia, the free encyclopedia
20 వ శతాబ్దపు మూడవ దశాబ్దము నుండి అతి శక్తివంతముగా జరుగుచుండిన శాంతియుత స్వరాజ్యోద్యమముల తాకిడి వలన నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వము మరోసారి రాజ్యాంగ సంస్కరణల పేరట 1933 లోప్రారంభించి చేసిన చట్టమును 1935 సంవత్సరము డిసెంబరులో శాసనముగా చేయబడెను. బ్రిటిష్ ఇండియా చరిత్రలో కల అనేక విశేషములలో 1935వ సంవత్సరపు ఇండియా రాజ్యాంగ చట్టము మరొక విశేషమైన చరిత్రాంశము. దాదాపు రెండు శతాబ్దములనుంచీ నిరంకుశముగా పరిపాలించుచున్న బ్రిటిష్ ప్రభుత్వము వారు భారతదేశమును తమ బానిస రాజ్యముగనుంచుకునటకు చేసిన అనేక రాజ్యతంత్రములలో 1935 చట్టము ద్వారా ప్రసాదించిన రాజ్యాంగము మరియొక రాజ్యతంత్రము. ఆ చట్టముద్వారా భారతదేశానికి అబ్బే రాజ్యాంగము రాజకీయ దాస్యమును ఆర్థికదుస్థితిని ఇంకా పొడింగచేందుకేనని గ్రహించిన భారతదేశ ప్రజలు, ప్రజానాయకులు, అఖిలపక్షముల జాతీయ నాయకులు ఆ చట్టము ద్వారా కలుగు క్రొత్త రాజ్యాంగమును తిరస్కరించుటలో కాంగ్రెసుతో ఏకీభవించుట వలన గాంధీజీ నాయకత్వములో కాంగ్రెస్సు వారు స్వతంత్రోద్యమమును శాస్త్రోక్తముగ క్రొత్తఉ్యూహములు అవలంబించి 1937 నుండి ఇంకా శక్తివంతముగనూ, శాంతియుతముగ సాగించారు
ఈ వ్యాసంలో అక్షరదోషాలు, వ్యాకరణం, శైలి, ధోరణి మొదలైన వాటిని సరి చెయ్యడం కోసం కాపీ ఎడిటింగు చెయ్యాల్సి ఉంది. (డిసెంబరు 2022) |
ఈ వ్యాసం లేదా విభాగం లేదా ఏదైనా మూలం నుండి కాపీ పేస్టు చేసినదై ఉండవచ్చు. ఇది బహుశా వికీపీడియా కాపీహక్కుల విధానం ప్రకారం ఉల్లంఘనై ఉండవచ్చు. ఈ వ్యాసంలో ఉచితం గాని కాపీహక్కులు కలిగిన భాగాలను తొలగించి, సరైన ఉచిత అంశాలనూ చేర్చి సరి చేయండి. లేదా తొలగించడానికి ప్రతిపాదించవచ్చు. ఈ కాపీహక్కుల ఉల్లంఘనకు మూలం వికీపీడియా మిర్రర్లు గాని, ఫోర్కులు గానీ కాదని గమనించండి. (డిసెంబరు 2022) |