భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థ
From Wikipedia, the free encyclopedia
భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థ అనేది ఖగోళ వస్తువుల స్థానాలను తెలిపేందుకు విస్తృతంగా ఉపయోగించే ఖగోళ నిర్దేశాంక వ్యవస్థ. దీన్ని గోళాకార లేదా దీర్ఘచతురస్రాకార నిర్దేశాంకాలలో చూపించవచ్చు. ఈ రెంటినీ భూమి కేంద్రం గానే నిర్వచిస్తారు. భూమి భూమధ్యరేఖను ఖగోళ గోళంపై పొడిగించడం ద్వారా (ఖగోళ మధ్యరేఖను ఏర్పరుస్తుంది) ప్రాథమిక తలాన్ని, వసంత విషువత్తు వైపుగా ప్రాథమిక దిశనూ నిర్వచిస్తారు. కుడిచేతి దిశను అనుసరిస్తారు. [1] [2]
మూలం భూమి కేంద్రం వద్ద ఉంటుంది అంటే దాని అర్థం ఈ నిర్దేశాంకాలు భూకేంద్రంగా ఉంటాయి అని. అంటే, భూమి పారదర్శకంగా ఉంది అనుకుంటే, అలాంటి భూమి కేంద్రం నుండి చూసినట్లు అన్నమాట. [3] ప్రాథమిక తలం, ప్రాథమిక దిశ అంటే ఈ వ్యవస్థ భూమి భూమధ్యరేఖతో ధ్రువంతో సమలేఖనంగా ఉంటుంది గానీ, భూమితో పాటు తిరగదు; నేపథ్యంలో ఉన్న నక్షత్రాలతో పోలిస్తే స్థిరంగా ఉంటుంది. కుడిచేతి దిశను అనుసరించడం అంటే నిర్దేశాంకాలు ప్రాథమిక తలం నుండి ఉత్తరం దిశ లోను, ప్రాథమిక తలం చుట్టూ తూర్పు దిశ లోనూ పెరుగుతూ పోతాయి.