భూమా నాగిరెడ్డి
From Wikipedia, the free encyclopedia
భూమా నాగిరెడ్డి (1964 జనవరి 8 - 2017 మార్చి 12) ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. అతను 1992 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[1] కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్రెడ్డి ఆకస్మిక మరణం చెందడంతో ఈయన ఈ స్థానానికి ఎంపికయ్యారు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
భూమా నాగిరెడ్డి | |||
పదవీ కాలం 1996-1998 1998-1999 1999-2004 | |||
ముందు | పి.వి.నరసింహారావు | ||
---|---|---|---|
తరువాత | ఎస్.పి.వై.రెడ్డి | ||
నియోజకవర్గం | నంద్యాల | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు | |||
పదవీ కాలం 1992-1996 | |||
ముందు | భూమా శేఖరరెడ్డి | ||
తరువాత | భూమా శోభా నాగిరెడ్డి | ||
నియోజకవర్గం | ఆళ్ళగడ్డ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1964-01-08)1964 జనవరి 8 ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
మరణం | 2017 మార్చి 12(2017-03-12) (వయసు 53) | ||
రాజకీయ పార్టీ | తెలుగు దేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ | ||
జీవిత భాగస్వామి | భూమా శోభా నాగిరెడ్డి | ||
సంతానం | భూమా అఖిల ప్రియ, భూమా నాగ మౌనిక, భూమా విఖ్యాత్ | ||
మతం | హిందూ | ||
మూలం |
మూసివేయి
1996 లో నంద్యాల లోక్సభ నియోజకవర్గంనకు ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అతనిని ఎంపిక చేయడంతో ఈయన వెలుగులోకి వచ్చాడు. అతను 11వ, 12వ, 13వ లోక్సభ సభ్యునిగా మూడు సార్లు తన సేవలను అందించాడు. 2017 మర్చి 12 న గుండె పోటుతో మరణించారు.[2]