మణిపురి భాష
From Wikipedia, the free encyclopedia
మణిపురి[3] (మీటేయ్[4][5] /mənɪˈpʊri/, మీయ్థేయ్, మీటేయ్లాన్) అన్నది ఈశాన్య భారతదేశంలో ఆగ్నేయ హిమాలయన్ రాష్ట్రమైన మణిపూర్లో ప్రధానమైన భాష, అనుసంధాన భాష. భారత రాజ్యాంగం షెడ్యూల్ 8లో ప్రస్తావించిన అధికార భాషల్లో మణిపురి ఒకటి, మణిపూర్ రాష్ట్రానికి ఇదే అధికార భాష. మణిపురి లేక మీటేయ్ అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లోనూ, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లోనూ మాట్లాడుతూంటారు. యునెస్కో ప్రస్తుతం దెబ్బతినే ప్రమాదమున్న భాషల్లో ఒకటిగా దీన్ని చేర్చింది.[6]
మణిపురీ | |
---|---|
మణిపురీ, మీథేయ్, మీటేయ్ | |
ప్రాంతం | ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్ |
స్వజాతీయత | మీటేయ్ |
స్థానికంగా మాట్లాడేవారు | 12.5 లక్షలు (2010)[1] నుంచి 14.85 లక్షలు (2001 జనగణన)[2] |
భాషా కుటుంబం | సినో-టిబెటన్
|
వ్రాసే విధానం | మీటేయ్ లిపి, తూర్పు నాగరి లిపి లాటిన్ లిపి |
అధికారిక హోదా | |
అధికార భాష | భారతదేశం (మణిపూర్) |
భాషా సంకేతాలు | |
ISO 639-2 | mni |
ISO 639-3 | – |
మణిపురి టిబెటో-బర్మన్ భాష. అయితే దీని వర్గీకరణలో స్పష్టత లేదు.దీనికి తంగ్ఖుల్ నాగా భాష పదాలతో 60 శాతం పోలిక ఉండి, నైఘంటుక సాదృశం కనిపిస్తోంది.[7]
మణిపురి (మీటేయ్) భాష మణిపూర్లోని అన్ని జాతుల వారూ ఒకరితో ఒకరు సంభాషించుకునేందుకు ఉపయోపడుతూ, తద్వారా మణిపూర్లోని జాతులన్నిటి ఐక్యతకు కారణంగా నిలుస్తోంది. 1992లో 72వ సవరణ ద్వారా దీన్ని రాజ్యాగంలోని షెడ్యూల్డ్ భాషల జాబితాలో చేర్చి, భారత యూనియన్ గుర్తించింది. మణిపురిని మణిపూర్లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకూ బోధనా మాధ్యమంగా ఉపయోగించడంతో పాటుగా భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, పరిశోధన స్థాయిలో ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు.[8]