ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం
ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం మహారాష్ట్రలోని ముంబై, దాని సమీప పట్టణాలను కలిగివున్న మెట్రోపాలి / From Wikipedia, the free encyclopedia
ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం మహారాష్ట్రలోని ముంబై, దాని సమీప పట్టణాలను కలిగివున్న మెట్రోపాలిటన్ ప్రాంతం. 6,355 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగివున్న ఈ ప్రాంతం[1] 26 మిలియన్లకు పైగా జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తోంది.[2]
ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
నగరం | ముంబై |
జిల్లా | ముంబై పరిసరం ఠాణే పాల్ఘర్ రాయగడ్ |
Area | |
• Metro | 6,355 km2 (2,454 sq mi) |
Population (2005 Census) | 2,07,48,395 |
• Density | 4,764/km2 (12,340/sq mi) |
Time zone | UTC+5:30 (IST) |
20 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ మెట్రోపాలిటన్ ప్రాంతంలో తొమ్మిది నగరపాలక సంస్థలు, పదిహేను చిన్న పురపాలక సంఘాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ముంబై మహానగర అభివృద్ధి సంస్థ (ఎంఎంఆర్డిఎ) పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థ పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, రవాణా, గృహాల బాధ్యత నిర్వర్తించే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థ.
మెట్రోపాలిటన్ ప్రాంతంలో సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళిక, అభివృద్ధికి సంబంధించిన సమస్యలను అధిగమించి, పరిష్కరించడానికి ఈ ముంబై మహానగర అభివృద్ధి సంస్థ ఏర్పడింది. ముంబై, నవీ ముంబై వెలుపల ఉన్న ప్రాంతాలలో వ్యవస్థీకృత అభివృద్ధి జరగలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికాబద్ధమైన నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చెందిన ఈ నవీ ముంబైని మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నగర, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (సిడ్కో) అభివృద్ధి చేసింది.
ముంబై పట్టణీకరణ వేగవంతంగా జరిగినందువల్ల ఈ ప్రాంతంలో అక్రమ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. భీవండి తాలూకాలోని మూడవ జాతీయ రహదిరి వెంట ఉన్న గ్రామాలలో (భారతదేశంలో అతిపెద్ద గిడ్డంగు ప్రాంతాలు) జరిగిన అవాంఛనీయ పరిణామాలు వీటికి ఉదాహరణలు చెప్పవచ్చు. పట్టణ ప్రణాళిక, ఠాణే జిల్లా కలెక్టర్ వంటి ప్రభుత్వ సంస్థలు ఈ అసంఘటిత అభివృద్ధిని పరిష్కరించడంలో సమస్యలను ఎదుర్కొన్నాయి.