ముళ్ళపూడి వెంకటరమణ
సుప్రసిద్ధ రచయిత / From Wikipedia, the free encyclopedia
ముళ్ళపూడి వెంకటరమణ (జూన్ 28, 1931 - ఫిబ్రవరి 24, 2011) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది.
త్వరిత వాస్తవాలు ముళ్ళపూడి వెంకటరమణ, జననం ...
ముళ్ళపూడి వెంకటరమణ | |
---|---|
జననం | ముళ్ళపూడి వెంకటరమణ జూన్ 28, 1931 ధవళేశ్వరం |
మరణం | ఫిబ్రవరి 24, 2011 8:47 నిమిషాలకు |
ఇతర పేర్లు | ముళ్ళపూడి వెంకటరావు |
ప్రసిద్ధి | తెలుగు రచయిత |
తండ్రి | సింహాచలం |
మూసివేయి
బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత. 1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకొన్నాడు.