రఘువీర్ చౌదరి
భారతీయ రచయిత / From Wikipedia, the free encyclopedia
రఘువీర్ చౌదరి ( జననం: 1938 డిసెంబర్ 5 ) గుజరాత్ రాష్టానికి చెందిన నవల రచయిత, కవి, విమర్శకుడు. ఈయన సందేశ్, జన్మభూమి, నిరీక్ష వంటి పత్రికలకు కాలమిస్ట్ గా వ్యవహరించారు. ఈయన గుజరాత్ యూనివర్సిటీలో అధ్యాపకునిగా విధులు నిర్వహించి, 1998లో రిటైర్ అయ్యారు. ఈయన గుజరాతి భాషలోనే కాకుండా హిందీ భాషలో కూడా రచించారు. ఈయన రచించిన ఉపర్వాస్ నవలకి 1977లో సాహిత్య పురస్కారం వరించింది. అదే కాకుండా సాహిత్యంలో అత్యుతమ పురస్కారం అయినా జ్ఞానపీఠ పురస్కారం 2015లో వరించింది.[1]